Share News

రైతులకు సిబిల్‌ గుబులు

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:40 AM

బ్యాంకులు కచ్చితంగా అమలుచేస్తున్న సిబిల్‌ స్కోర్‌ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా మారిం ది. ఆర్‌బీఐ నిబంధన పేరుతో పం టరుణాలకు సైతం సిబిల్‌ స్కోర్‌ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

రైతులకు సిబిల్‌ గుబులు

650పాయింట్లు ఉంటే నే రుణం ఇస్తామంటున్న బ్యాంకులు

మూడేళ్ల రికవరీ ట్రాక్‌ రికార్డు ను చూడనున్న బ్యాంకర్లు

కలవరపడుతున్న చిన్న, సన్నకారు రైతులు

రుణమాఫీ పథకంతో సిబిల్‌ స్కోర్‌ పడిపోయిందనే వాదన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : బ్యాంకులు కచ్చితంగా అమలుచేస్తున్న సిబిల్‌ స్కోర్‌ నిబంధన రైతులకు ఇబ్బందికరంగా మారిం ది. ఆర్‌బీఐ నిబంధన పేరుతో పం టరుణాలకు సైతం సిబిల్‌ స్కోర్‌ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సిబిల్‌ స్కోర్‌ కనీసం 700 నుంచి 650 పాయింట్లు ఉంటేనే రైతులకు సైతం రుణాలు, ఇతర రుణాలు ఇస్తున్నారు. సిబిల్‌ నిబంధనతో రైతులు రుణాల కోసం ఇబ్బందిపడుతున్నారు.

సిబిల్‌ స్కోర్‌ నిబంధనతో ప్రధానంగా చిన్న,సన్నకారు రైతులు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. రుణాల రికవరీలో మూడేళ్ల ట్రాక్‌ రికార్డ్‌ చూస్తున్నామని, ఆ రికార్డు సరిగా ఉంటే రైతులకు సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్నా రుణాలు ఇస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నా రు.గత రుణాల చెల్లింపుల్లో ఒకటి, రెండు నెలల వ్యత్యాసం ఉన్నా రుణాలు మంజూరు చేస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే చిన్న, సన్నకారు రైతులు చాలామందికి ట్రాక్‌ రికార్డు ఉండడం లేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో రుణమాఫీ పథకం దశలవారీగా అమలు చేయడంతో పంటరుణాలు పొందిన రైతులందరికీ రుణాల మాఫీకి ఐదేళ్ల సమయం పట్టింది. అదేవిధంగా వడ్డీల భారమూ ఎక్కువైంది. దీంతో పలువురు చిన్న, సన్నకారు రైతులు వడ్డీలు చెల్లించలేక, రుణాలు రెన్యువల్‌ కూడా చేయించుకోలేకపోయారు. దీంతో ఫెనాల్టీలు కలుపుతూ వచ్చిన బ్యాంకర్లు ఆ రైతుల ఖాతాలను డీఫాల్ట ర్‌ కింద, నిరర్థక ఆస్తుల కింద ప్రకటించారు. దీంతో ఇటీవల జరిగిన రుణమాఫీ పథకంలో సైతం ఈ రైతుల పేర్లను జాబితాల్లో చేర్చకపోవడంతో వారంతా రుణమాఫీ పథకానికి దూరమయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది అమలైన రుణమాఫీ పథకం సైతం విడతల వారీగా కొనసాగడంతో రైతులంతా సకాలంలో వడ్డీగానీ, అసలుగానీ చెల్లించలేదు. దీంతో రుణఖాతాల రెన్యూవల్‌ నిలిచిపోయింది. గత ఏడాది వరకు ఏటా రుణాలు చెల్లించిన రైతులు సైతం రుణమాఫీ జమయ్యాక బ్యాలెన్స్‌ ఉంటే చెల్లిద్దామనే ఆలోచనతో వేచి ఉండడంతో వారందరి సిబిల్‌ స్కోర్‌ పడిపోయింది. దీంతో పెద్దసంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు పంటరుణాలు పొందడానికి అనర్హులుగా తేలారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే పంట రుణాలకు సైతం సిబిల్‌ స్కోర్‌ పరిగణనలోకి తీసుకుంటుండడంతో రైతు ల్లో కలవరం మొదలైంది. పంటరుణాలకు బ్యాం కర్లు సిబిల్‌ స్కోర్‌ పరిశీలించడం సరికాదని, ఈ నిబంధనను సడలించాల్సిందేనని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వాలు రుణమాఫీ పథకాన్ని ఏకసమయంలో కాకుండా విడతల వారీగా చేస్తుండడంతో రైతులు రుణాల చెల్లింపుల్లో జాప్యం చేశారని, ప్రభుత్వాలు చేసిన జాప్యంతో రైతులు పరపతి కోల్పోవాల్సి వచ్చింద న్న విషయాన్ని బ్యాంకర్లు, ప్రభుత్వం గుర్తించి రుణాల విషయంలో సిబిల్‌ స్కోర్‌ నిబంధన తీసివేయాలని కోరుతున్నారు.

సిబిల్‌ స్కోర్‌ ఉంటేనే రుణం ఇస్తున్నారు : చీకూరి గోవిందరావు, రైతు,గోపాలపురం, హుజూర్‌నగర్‌

రైతులకు అప్పు ఇవ్వాలన్నా బ్యాంకులో సిబిల్‌ స్కోర్‌ చూస్తున్నారు. 700 పాయింట్లు ఉంటేనే రుణాలు ఇస్తున్నారు. బంగారం తాకట్టు రుణాలకు సైతం సిబిల్‌ స్కోర్‌ పరిశీలించిన తర్వాతే రుణం మంజూరు చేస్తున్నారు. రుణమాఫీ పథకం కింద ఉన్న రైతులకు ప్రభుత్వం విడతలవారీగా మాఫీ చేసింది. దీంతో ఈ పథకం కింద అర్హులైన వారిలో ఎక్కువ మందికి సిబిల్‌ స్కోర్‌ పడిపోయింది. దీంతో వారికి కొత్త రుణాలు రాలేదు. మళ్లీ నాలుగైదు నెలలపాటు లావాదేవీలు నిర్వహించి సిబిల్‌ స్కోర్‌ పెంచుకుంటేనే రుణాలు మంజూరు చేస్తున్నారు.

రైతులను ఇబ్బంది పెట్ట డం సమంజసం కాదు : కక్కిరేణి నాగయ్య, రైతుసంఘం నాయకుడు, సూర్యాపేట

రైతులకిచ్చే పంటరుణాలకు సిబిల్‌ స్కోర్‌ నిబంధన విధించడం సమంజసం కాదు. దీంతో చిన్న, సన్నకారు రైతులు పెద్దసంఖ్యలో బ్యాంకు రుణాలు పొందలేక ప్రైవేట్‌ వడ్డీవ్యాపారులని ఆశ్రయిస్తున్నారు. సిబిల్‌ స్కోర్‌పై రైతులకు చాలామందికి అవగాహన లేదు. పంటరుణాల విషయంలో తక్షణం సిబిల్‌ స్కోర్‌ నిబంధనను తొలగించాలి. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలివ్వాలి.

సిబిల్‌ స్కోర్‌ నిబంధన ఎత్తివేయాలి : పల్లె మల్లారెడ్డి, రైతు, సంస్థాన్‌నారాయణపురం

రైతులకు పంట రుణాలకు సైతం సిబిల్‌ స్కోర్‌ ఉంటేనే రుణాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు పట్టాదారు పాస్‌బుక్‌ తనఖాపెట్టుకుని పంటరుణాలు ఇచ్చేవారు. రైతులకు రుణమాఫీ పథకం వచ్చాక పదేళ్లలో, ఈ పర్యాయం సైతం రుణమాఫీ లబ్ధిదారులకు ఒకేసారి కాకుండా విడతలవారీగా మాఫీ చేశారు. దీంతో రైతులు డిఫాల్టర్‌ జాబితాలో చేరి సిబిల్‌ స్కోర్‌ పడిపోయింది. ప్రభుత్వ జాప్యానికి రైతును బలిచేస్తున్నారు. పంటరుణాలకు సిబిల్‌ స్కోర్‌ నిబంధన ఎత్తివేసి ఎప్పట్లాగే పాస్‌పుస్తకాల తనఖాతో రుణాలు ఇవ్వాలి.

Updated Date - Jun 14 , 2025 | 12:40 AM