Share News

పీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:41 AM

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గం లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు ప్రాధాన్యం దక్కింది. పీసీసీ ఉపాధ్యక్ష పదవులు ముగ్గురికి, నలుగురికి ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి. పీసీసీ ఉపాధ్యక్షులుగా నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డికి అవకాశం దక్కితే, ప్రధాన కార్యదర్శులుగా చనగాని దయాకర్‌గౌడ్‌, దైద రవీందర్‌, చకిలం రాజేశ్వర్‌రావు, వీ.రామారావుగౌడ్‌ని నియమించా రు.

పీసీసీ కార్యవర్గంలో  ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం

ముగ్గురికి ఉపాధ్యక్ష, నలుగురికి ప్రధాన కార్యదర్శి పదవులు

యువనేతలకు అవకాశం

ఎంపీ రఘువీర్‌కు పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఛాన్స్‌

ఆశించని పదవి ఇవ్వడంపై గుమ్ముల నారాజ్‌!

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ) : ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గం లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు ప్రాధాన్యం దక్కింది. పీసీసీ ఉపాధ్యక్ష పదవులు ముగ్గురికి, నలుగురికి ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి. పీసీసీ ఉపాధ్యక్షులుగా నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డికి అవకాశం దక్కితే, ప్రధాన కార్యదర్శులుగా చనగాని దయాకర్‌గౌడ్‌, దైద రవీందర్‌, చకిలం రాజేశ్వర్‌రావు, వీ.రామారావుగౌడ్‌ని నియమించా రు. పీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీతో పాటు, కీలకనేతలకు పదవులు దక్కడంపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

పీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి కీలకమైన నాయకులకే పీసీసీ కార్యవర్గంలో అవకాశం దక్కిందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం దక్కిన వారిలో ముగ్గురు ఓసీ నేతలుండగా, ఇద్దరు ఎస్సీ నేతలు, ఇద్దరు బీసీ నేతలకు పదవులు వరించాయి. యువతరంతో పా టు ఆయా సందర్భాల్లో పార్టీకి పట్టుగొమ్మల్లా నిలిచిన నాయకులకు ఈ పదవులు దక్కాయనే అభిప్రాయం వెల్లడవుతోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయడంతో పాటు కేడర్‌ని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి సులభంగా విజయం దక్కేలా చూడాల్సిన కీలకబాధ్యతలు ఈ పీసీసీ కార్యవర్గంపై ఉందని పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఇప్పటికే పేర్కొన డం ఈ పదువులు పొందిన నేతలపై ఉన్న బాధ్యతలని తెలుపుతోంది. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌కి పీసీసీ ఉపాధ్యక్షుడిగా అవకాశం దక్కింది. గత పీసీసీ కార్యవర్గంలో ప్రధా న కార్యదర్శిగా పనిచేసిన రఘువీర్‌, అంతకుముం దు రాష్ట్ర యువజన కాంగ్రె్‌సలో జాయింట్‌ సెక్రటరీ గా పనిచేశారు. మరో ఉపాధ్యక్షుడిగా నియమితులైన గుమ్ముల మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి వీరవిధేయుడుగా పేరుగాంచారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌ కార్యకర్తగా పనిచేస్తున్న ఆయన ఒక పర్యాయం జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేయగా, ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. నల్లగొండ పట్టణాధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షపదవి వరించిన మరో నేత కొండే టి మల్లయ్య గత పీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఉండగా, అంతకుమునుపు ఆయన నిడమనూరు జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించగా, అప్పటి సమీకరణాల్లో అవకాశం దక్కలేదు. తాజాగా ఈయనకు ఈ పదవి వరించింది.

ప్రధాన కార్యదర్శులుగా నలుగురికి ఛాన్స్‌

పీసీసీ తాజా కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు కీలకనాయకులు ప్రధాన కార్యదర్శులుగా నియమితలయ్యారు. సూర్యాపేట నియోజకవర్గం తాళ్లఖమ్మంపహాడ్‌కు చెందిన సీనియర్‌నేత చకిలం రాజేశ్వరరావుకు ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. ఈయన గత కార్యవర్గంలో పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేయగా, అంతకుమునుపు ఉమ్మడి జిల్లా డీసీసీ అధికార ప్రతినిధిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎన్‌ఎ్‌సయూఐ, యూత్‌ కాంగ్రె్‌సలలో పనిచేస్తూ వచ్చిన రాజేశ్వరరావు పార్టీలో తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌గానూ పనిచేశారు. అదేవిధంగా పార్టీ అనుబంధ సంఘాల్లో, పార్టీ కార్యక్రమాల్లో విస్తృతస్థాయిలో పనిచేసిన అనుభవం రాజేశ్వరరావుకు ఈ పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాన కార్యదర్శిగా మరో కీలకనేత దైద రవీందర్‌కు అవకాశం దక్కింది. సూర్యాపేట మాజీ ఎమ్మె ల్యే దైద సుందరయ్య తనయుడైన దైద రవీందర్‌ 2016లో కాంగ్రె్‌సలో చేరారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా నియమితులైన ఆయన నకిరేకల్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేక ల్‌ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి, చివరివరకు పోటీపడ్డా రు. ప్రస్తుతం ఈయనకు పీసీసీ ప్రధాన కార్యదర్శి గా అవకాశం ఇవ్వడం ద్వారా మరోసారి ఆయన క్రియాశీలకమయ్యేందుకు అవకాశం ఏర్పడింది. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా జిల్లా నుంచి మరో బీసీ యువనేత చనగాని దయాకర్‌గౌడ్‌ని నియమించా రు. నకిరేకల్‌ మండలం తాటికల్‌కు చెందిన ఈయ న విద్యార్థి జేఏసీ నేతగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనిచేసిన సమయంలో పార్టీలో చేరిన దయాకర్‌గౌడ్‌ పార్టీ నిరుద్యోగ జేఏసీ నాయకుడిగా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పలు ఆందోళనలు, ఉద్యమాల్లో క్రియాశీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాజాగా పీసీసీ ప్రధానకార్యదర్శి పదవి దక్కింది. మరో బీసీ యువనేత వట్టికూటి రామారావుగౌడ్‌కి ప్రధాన కార్యదర్శిగా ఈ కార్యవర్గంలో ఛాన్స్‌ దక్కింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడానికి చెందిన రామారావు వామపక్ష విద్యార్థి సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ నాయకుడిగా క్రియాశీలకంగా పనిచేసిన ఆయన బీసీ సామాజిక ఉద్యమాల్లో పనిచేశారు. హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన కొంతకాలం క్రితం కాంగ్రె్‌సలో చేరారు. తాజాగా ఆయన్ను పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది.

పీసీసీ ఉపాధ్యక్ష పదవిపై గుమ్ముల నారాజ్‌

పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన గుమ్ముల మోహన్‌రెడ్డి ఈ పదవి తీసుకోవడానికి సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. కేడర్‌ సైతం ఆయన్ను ఈ పదవి తీసుకోవద్దని ఒత్తిడి తెస్తున్నట్లు నల్లగొండ కాంగ్రె్‌సలో చర్చ సాగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైన మోహన్‌రెడ్డి పార్టీలో ఎన్‌ఎ్‌సయూఐ నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి జిల్లా యూత్‌కాంగ్రె్‌స అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు పార్టీ నేతలందరితో సాన్నిహిత్యముండడంతో పాటు, కేడర్‌తో విస్తృత స్థాయి సంబంధాలున్నాయి. పార్టీ అధికారంలో లేని సంక్షోభ సమయంలోనూ పార్టీని వీడకుండా కొనసాగడమే కాకుండా, కార్యకర్తలను పార్టీ వీడకుండా కాపాడిన వ్యక్తిగా మోహన్‌రెడ్డికి పార్టీలో పేరుంది. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న మోహన్‌రెడ్డ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవి రాబోతోందని మంత్రి వెంకటరెడ్డి లోక్‌సభ ఎన్నికల సందర్భంలో కార్యకర్తల సమావేశంలో ప్రకటించగా, ఆయనకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఖాయమని భావించారు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షపదవికి సైతం ఇటీవల ఆయన పేరుని అధిష్టానం పరిశీలించింది. జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండే నేతగా, పార్టీ వ్యవహారాలను, కార్యక్రమాలను సమర్ధంగా నిర్వహించే నాయకుడిగా గుర్తించి డీసీసీ బాధ్యతలివ్వాలని జిల్లానేతలు సూచించగా, కీలకమైన పదవి ఇవ్వాలని కేడర్‌ అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో అయితే రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి, లేకపోతే డీసీసీ అధ్యక్ష పదవి ఖాయంగా వస్తుందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా మోహన్‌రెడ్డికి పీసీసీ ఉపాధ్యక్షపదవి రావడంపై నల్లగొండ పార్టీశ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఈ పదవి స్వీకరించవద్దనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఆశించని పదవిని ఎందుకిచ్చారనే అంశంపై తర్జనభర్జనపడుతున్నారు.

ఇంటి పేరు తెచ్చిన తంటా..

మోత్కూరు: కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన రాష్ట్ర ప్రధాన కార్యద ర్శుల జాబితాలో పేరు పక్కన ఇంటి పేరు లేకపోవడంతో ఇద్దరు నాయ కులు ఆ పదవి నాదేనంటే నాదే అని చెప్పుకున్నారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో ఒక పేరు ఉపేందర్‌రెడ్డి అని ఉంది. ఆ పేరు పక్కన ఇంటి పేరు లేదు. దీంతో మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు చింతల ఉపేందర్‌రెడ్డి తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెబుతుండగా, ఆలేరు నియోజక వర్గం పరిఽధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు జనగామ ఉపేందర్‌రెడ్డి తనకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెబుతున్నారు. ఇద్దరూ ఎవరికి వారు ఆ జాబితాలో ఉన్నది తన పేరేనని చెబుతున్నారు. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు నాయకులు తానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శినని చెబుతుండడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్య కర్తలు అయోమయానికి గురయ్యారు. ఈ విషయమై యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిని అడగ్గా ఏఐసీసీ నుంచి వచ్చిన జాబితా అయినందున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారని పార్టీ నాయకత్వమే చెబుతుందన్నారు.

పీసీసీ ప్రధాన కార్యదర్శిగా జనగాం ఉపేందర్‌రెడ్డి

ఆలేరు రూరల్‌: పీసీసీ ప్రధాన కార్యదర్శిగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జనగాం ఉపేందర్‌రెడ్డిని నియమిస్తూ మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉపేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 11 , 2025 | 12:41 AM