ఈసారీ ఆలస్యమేనా?
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:44 AM
నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నా యి. జూన్లో భారీగా వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి వర్షాలు కురియగా నే చెరువుల్లో చేపపిల్లల పంపిణీ చేపట్టాలని మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు.

చేపపిల్లల పంపిణీపై కసరత్తు చేయని సర్కార్
ఇప్పటికే టెండర్లు పూర్తి కావాల్సి ఉంది
చేపపిల్లల పంపిణీపై నివేదిక కోరని సర్కార్
ఆలస్యమైతే చేపల ఎదుగుదల ఉండదంటున్న మత్స్యకారులు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నా యి. జూన్లో భారీగా వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి వర్షాలు కురియగా నే చెరువుల్లో చేపపిల్లల పంపిణీ చేపట్టాలని మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. అయి తే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చేపల పంపిణీపై ఎటువంటి కార్యాచరణ లేదు. కనీసం టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంతో సాగునీటి వనరులను నమ్ముకున్న మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ ఆలస్యంకానుంది. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి మత్స్యకారుల కు ప్రతీ ఏడాది ఉచితంగా చేపపిల్లలను పంపి ణీ చేస్తోంది. గతేడాది రాష్ట్రంలో ప్రభుత్వం మా రడంతో ఈ పథకాన్ని నూతనంగా ఏర్పాటైన సర్కారు కొనసాగిస్తుందా? లేదా అన్నది సందిగ్ధ త వ్యక్తం కాగా గతంలో మాదిరే 100 శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.అయితే నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈసారి కూడా చేపల పంపిణీ ఆలస్యం కానుంది. సాధారణంగా మే నెలాఖరులోగా చేపపిల్లల పంపిణీ టెండర్ల ప్రక్రి య పూర్తి చేయాలి. కానీ ఇప్పటి వరకు ప్రభు త్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. జిల్లాలో మొత్తం 171మత్స్య పారిశ్రామిక సహకార సం ఘాలు, 15మహిళా మత్స్యపారిశ్రామిక సంఘా లు,ఒకటి మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘాలు ఉన్నాయి. ఈసంఘాల్లో మొత్తం 10,345 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చేపలు, రొయ్యలను విక్రయించి జీవనం సాగిస్తున్నారు. చేపపిల్లల పంపిణీలో ఇప్పటి వరకు ఏఒక్క ఏడాదిలోనూ సరైన సమయంలో పంపి ణీ చేయలేదు. ఈసారి ముందస్తుగా టెండర్లు పూర్తి చేస్తారని ఆశించినా, ఆ మేరకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడంలేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సరైన సమయంలో వదిలితేనే
ప్రభుత్వం పంపిణీ చేసే చేపపిల్లలను సరైన సమయంలో చెరువుల్లో వదిలితేనే మత్స్యకారుల కు ప్రయోజనం ఉంటుంది. ఆలస్యమైన పక్షంలో చేపల ఎదుగుదల ఉండదని మత్స్యకారులు అంటున్నారు. చేప, రొయ్య పిల్లలను జూన్, జూలై నెలల్లో చెరువుల్లో పంపిణీ చేసిన పక్షంలో ఆరు నెలల్లోగా రెండు నుంచి మూడు కిలోల వరకు ఎదుగుదల ఉంటుంది. ఈ చేపలకే మార్కెట్లో ధర కూడా ఉంటుంది. అయితే ఆలస్యంగా చేపలు పంపిణీతో చేపలు ఒకటిన్నర కిలోలు కూడా ఎదగడం లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపపిల్లల పంపిణీపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
చేపపిల్లల పంపిణీపై నివేదిక కోరని సర్కార్
ప్రతీ ఏడాది ఉచితంగా చేపపిల్లల పంపిణీపై జిల్లాల వారీగా ప్రభుత్వం నివేదికలు కోరుతోంది. ఈ ఏడాది పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు చేయలేదు. జూన్లో టెండర్లు పూర్తయిన పక్షంలో చెరువుల్లో నీరు చేరగానే పిల్లలు పంపిణీ చేస్తే బాగుంటుందని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆగస్టులో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వానాకాలంలోని వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 17మండలాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. భారీవర్షాలు కురిసిన పక్షంలో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 803 చెరువులు ఉన్నాయి. జిల్లాయంత్రాంగం గుర్తించిన చెరువుల్లో ప్రతీ సంవత్సరం చేపపిల్లలను పంపిణీ చేస్తారు. గత ఏడాది జిల్లాలో దాదాపు 400 చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు జిల్లా మత్స్యశాఖ చర్యలు తీసుకుంది. ఈసారి చెరువుల్లో చేరిన నీటి లభ్యత ఆధారంగా సీడ్ను పంపిణీ చేయనున్నారు.
చేపపిల్లల టెండర్లు పూర్తికాలేదు :రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యకారులకు ఉచితంగా చేపల పిల్లల పంపిణీపై ప్రక్రియను చేపడుతున్నాం. ఇప్పటివరకు సీడ్ పంపిణీపై టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. టెండర్లు పూర్తికాగానే జిల్లాలోని మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయనున్నాం. వానాకాలంలో చెరువుల్లో నీటి నిల్వ ఆధారంగా చేప పిల్లలను పంపిణీ చేయనున్నాం.