వ్యర్థాలు తరలించరూ!
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:46 AM
పట్టణ పారిశుధ్యం ప్రధాన లక్ష్యంగా అన్ని మునిసిపాలిటీలలో వం దరోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈమేరకు భువనగిరి మునిసిపాలిటీలో కూడా ప్రతీరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

భువనగిరి టౌన్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పట్టణ పారిశుధ్యం ప్రధాన లక్ష్యంగా అన్ని మునిసిపాలిటీలలో వం దరోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఈమేరకు భువనగిరి మునిసిపాలిటీలో కూడా ప్రతీరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మురుగు కాల్వల్లో పూడికతీత, అడ్డంకిగా ఉన్న చెట్లకొమ్మల నరికివేత, బస్తీలలో పేరుకుపోయిన వ్యర్థాల తరలింపు, మలేరి యా నియంత్రణ పేరిట దోమల నివారణకు మురుగు నీటి గుంతలలో ఆయిల్ బాల్స్ కూడా వేస్తున్నారు. వర్షాకా లం సమీపిస్తున్నందున వరద, మురుగు నీటి కాల్వల్లో పూడికతీతకు సుమారు రూ.10లక్షలతో టెండర్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు పనులు కూడా అప్పగించారు. ఇంతవర కు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం 100రోజుల ప్రచారానికి తగినట్టుగా అమలు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మురుగు కాల్వలు తదితర ప్రాంతాల్లో తొలగించిన పిచ్చి మొక్కలు, నరికిన చెట్ల కొమ్మలు, మురు గు కాల్వల నుంచి తీసిన పూడిక తరలించడంలో చూపుతు న్న అలసత్వం ఆయా ప్రాంతాల్లో నూతన సమస్యలకు కారణమవుతున్నాయి. దుర్గంధంతోపాటు గాలులకు పరిస ర ప్రాంతాల్లోని జనావాసాల మధ్యకు చేరుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారుల కళ్లలో పడుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికైనా వంద రోజుల ప్రణాళికను సమగ్రంగా, చిత్తశుద్ధిగా అమలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
వైద్య శిబిరం..
వందరోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం భువనగి రి మునిసిపల్ పరిధిలో మెప్మా రిసోర్స్ పర్సన్లు, మహిళా సంఘాల సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అలాగే 2, 4, 6, 12, 13, 22, 23, 25, 26, 27, 28, 29వ వార్డులలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. కమిషనర్ జి.రామలింగం శానిటరీ ఇన్స్పెక్టర్ జిలాలుద్దీన్, హెల్త్ అసిస్టెంట్ రజిత తదితరులు పాల్గొన్నారు.