కగార్ పేరుతో ప్రజాస్వామ్యం ఖూనీ
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:33 AM
కగార్ పేరుతో కేంద్ర ప్రభు త్వం నక్సల్స్ను కాల్చి చంపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. హుజూర్నగర్ పట్టణం లో బుధవారం నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ
హుజూర్నగర్, జూన 11 (ఆంధ్రజ్యోతి) : కగార్ పేరుతో కేంద్ర ప్రభు త్వం నక్సల్స్ను కాల్చి చంపుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. హుజూర్నగర్ పట్టణం లో బుధవారం నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి ఖనిజ సంపద ను దోచుకునేందుకు, ఆదివాసీలను అడవుల నుంచి పంపించేందుకు ఇ లాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మావోయిస్టులతో మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలు జరపాలన్నారు. రాష్ట్రంలో కాళేశ్వ రం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్కు నోటీసు లు ఇవ్వడం లాంటి చర్యల వల్ల పరిపాలన పక్కదారి పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాతప్రాజెక్ట్లను ఎందుకు పూర్తిచేయడం లేదన్నారు. సీఎం సొంత జిల్లా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డీఎస్సీ ప్రకటించాలన్నారు. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఈ నెల 17న నిరసనలు, బంధు కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్బాస్, నాగారపు పాండు, పల్లె వెంకటరెడ్డి, ముల్కలపల్లి రాములు, దుగ్గి బ్రహ్మం, పోసనబోయిన హుస్సేన్, శీలం శ్రీను, వీరమల్లు, త్రివేణి, కోట రమేష్, నెమ్మాది వెంకటేశ్వర్లు, పొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, గోపి, వట్టెపు సైదులు, నగేష్, బాలు, శ్రీను, వెంకటచంద్ర, జక్కుల వెంకటేశ్వర్లు, వీరబాబు, శంభయ్య పాల్గొన్నారు.