ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:20 PM
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పోరాడుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి అన్నారు.

- దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి
భూత్పూర్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పోరాడుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం మునిసి పాలిటీ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపినీ చేసి, మాట్లాడారు. దేశంలో రోల్ మోడల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. నియోజవర్గానికి 3500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. భూత్పూర్ మండలానికి 404 ఇళ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలిపారు. అంతకుముందు భూత్పూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్గౌడ్, ఎంపీడీవో ప్రభాకర్చారి, తహసీల్దార్ కిషన్నాయక్ పాల్గొన్నారు.
కాంగ్రెస్తో సొంతింటి కల సాకారం
దేవరకద్ర : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వివిధ గ్రామాల లబ్ధిదారులు 330 మందికి ప్రొసీడింగ్లు అందజేసి, మాట్లాడారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెకట్రరీ అరవింద్కుమార్రెడ్డి, ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, నరసింహరెడ్డి, మార్కెట్ చైర్మన్ కథలప్ప, మండల అధ్యక్షుడు అంజిల్రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మికాంత్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఫారుక్అలీ, ఎంపీడీవో శ్రీనివాస్రావు, తహసీల్దార్ కృష్ణయ్య పాల్గొన్నారు.
హన్వాడ : మండలంలోని బుద్ధారం గ్రామంలో కాంగ్రెస్ మండల నాయకుడు సుధాకర్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కార్యదర్శి రాఘవేందర్తో కలసి ప్రొసిడింగ్లు అందించారు.