గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:06 PM
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.

- ఎంజేపీ గురుకులాన్ని సందర్శించిన ఎమ్మెల్యే విజయుడు అలంపూరు చౌరస్తా, జూలై 30 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. బుధవారం ఆయన అలంపూరు చౌర స్తాలోని ఎంజేపీ గురుకుల పాఠశాలను సంద ర్శించారు. సమస్యలపై రోడ్డెక్కిన పాఠశాల వి ద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకు న్నారు. బియ్యాన్ని, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. గురుకులాలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆరోపించారు. కాలకృత్యాలకు ము ళ్లపొదల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి రావాడం దారుణ మని అన్నారు. కనీసం తాగునీరు కల్పించలేని ప్రభుత్వాన్ని మనం చూస్తున్నామని అన్నారు. పిల్లల సమ స్యలను మంత్రుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.