Share News

‘ప్రైవేట్‌’ దోపిడీ

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:29 PM

ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్‌లో మంచి ర్యాంకులు వస్తున్నాయని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని, నమ్మించి నట్టేట ముంచుతున్నాయి.

‘ప్రైవేట్‌’ దోపిడీ

సంపాదనే ధ్యేయంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల తీరు

గత ఏడాది కంటే ఈ సారి ఫీజులు 20 శాతం పెంపు

అడ్మిషన్‌ ఫీజు రూ.1000 నుంచి రూ.3,500లకు

స్కూళ్లలో పాఠ్య, నోట్‌ పుస్తకాలు, షూ, టై, బెల్టుల విక్రయం

విద్యాశాఖ నిబంధనలు పాటించని యాజమాన్యాలు

ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్‌లో మంచి ర్యాంకులు వస్తున్నాయని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని, నమ్మించి నట్టేట ముంచుతున్నాయి. ఈ ఏడాది గతంకంటే ఏకంగా 20 శాతం ఫీజులు పెంచడంతో విద్యార్థుల పేరెంట్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. ఎల్‌కేజీ పిల్లలకే పుస్తకాలకు రూ.6,500 వరకు వసూలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలపై నిఘా ఉంచాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,325 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌, వపపర్తి, నాగర్‌కర్నూల్‌, జో గుళాంబ గద్వాల, నాయయణపేట జిల్లా కేంద్రా లతో పాటు జడ్చర్ల, కల్వకుర్తి, అలంపూర్‌, అ చ్చంపేట, దేవరకద్ర, మక్తల్‌ తదితర పట్టణాల తో పాటు మండల కేంద్రాల్లో ప్రైవేట్‌ పాఠశాల లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తమ పాఠశాల విద్యార్థులు ఇన్ని మార్కులు తెచ్చుకున్నారు.. అ న్ని మార్కులు తెచ్చుకున్నారంటూ విద్యార్థుల ఫొటోలు, మార్కులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. పట్టణాలు, గ్రామాల్లో రంగురంగుల ఫొటో లతో పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు.

తల్లిదండ్రుల కమిటీలేవీ?

విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆయా పాఠ శాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు, పోషకులతో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుం ది. కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఫీజులపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ ప్రైవేట్‌ పాఠశాలలోనూ తల్లిదండ్రుల కమిటీ లను ఏర్పాటు చేయలేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యాజమాన్యాలే ఫీజుల ను నిర్ణయిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది అడ్మి షన్‌, ట్యూషన్‌తో పాటు, పుస్తకాలు, యూనిఫా మ్స్‌, షూ, టై, బెల్టు తదితరాల పేరుతో గత ఏ డాది కంటే 20 శాతం ఫీజులు పెంచాయి. అడ్మి షన్‌ ఫీజు గత ఏడాది రూ.1000 ఉంటే, ఈ ఏ డాది పాఠశాల స్థాయిని బట్టి రూ. 2000 నుం చి రూ. 3500 వరకు పెంచాయి. పుస్తకాల ధర లు కూడా గణనీయంగా పెంచేశాయి. ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండు, మూడవ తరగతుల పుస్తకాలకు రూ.4,500 నుంచి రూ.6,500 వసూ లు చేస్తున్నారు. నాలుగు, ఐదు తరగతులకు రూ.5000 నుంచి రూ.7,500 తీసుకుంటున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు రూ.8,500, పదవ తరగతి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌కు రూ. 9,500 నుంచి రూ.11,000 వరకు వసూలు చే స్తున్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పాఠ్య, నోట్‌ పుస్తకాలు, షూ, టై, బెల్టులు విక్రయించొద్దని వి ద్యాశాఖ నిబంధనలున్నాయి. కానీ ఈ నిబంధ నను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వాటిని విక్రయిస్తూ విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి వేలాది రూపాయలు దండు కుంటున్నాయి.

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థు లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరి స్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకో వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీల ను ఏర్పాటు చేయలేదు. విద్యార్థుల తల్లిదం డ్రులతో సమావేశాలు కూడా నిర్వహించ డం లేదు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమా న్యాలతో డీఈవోలు, ఎంఈవోలు సమావేశం కూడా నిర్వహించ లేదు. కనీసం ఎంత ఫీ జులు వసూలు చేస్తున్నారో తెలుసుకు నేందుకు పాఠశాలలను తనిఖీ చేసిన దాఖ లాలు కూడా లేవన్న విమర్శలున్నాయి. వి ద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కొ న్ని పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. కొందరు తల్లిదండ్రులు ఫలానా పాఠశాల లో అడ్మిషన్‌ కావాలంటూ విద్యాశాఖ అధికారులను కోరితే వారే సిఫారసు చేసి, సీట్లు ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరి స్థితిల్లో ఫీజుల నియంత్రణ ఎలా సాధ్యం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:29 PM