ప్రతీ విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:22 PM
ప్రతీ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అభిప్రాయపడ్డారు.

- విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి
- విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ
జడ్చర్ల, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అభిప్రాయపడ్డారు. జడ్చర్ల జడ్పీహెచ్ఎస్, బాదేపల్లి బాలుర జడ్పీహెచ్ఎస్లలో గురువారం విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పుస్తకాలు, యూనిఫాంలను అందజేసి, మాట్లాడారు. నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానన్నారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని అభినందించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల మాదిరిగానే షూస్ వేసుకుని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 28వేల మంది విద్యార్థులకు షూ పంపిణీ చేస్తానన్నారు. బాదేపల్లి బాలుర జడ్పీహెచ్ఎస్లో శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించి, కేక్ కట్ చేశారు. ఉత్సవాలకు తనవంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. జడ్చర్ల జడ్పీహెచ్ఎస్లో అంగన్వాడీ సెల్ఫీబోర్డు వద్ద అంగన్వాడీ విద్యార్థులతో ఫొటోలు దిగారు. ఎంఈవో మంజులాదేవి, మునిసిపల్ చైర్పర్సన్ కోనేటిపుష్పలత, వైస్ చైర్పర్సన్ పాలాది సారిక, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతిఆల్వాల్రెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు : ఎమ్మెల్యే జీఎంఆర్
చిన్నచింతకుంట : ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని పెద్ద వడ్డెమాన్ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం అందజేసే యూనిఫాం, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి, మాట్లాడారు. అంతకుముందు దమగ్నాపూర్ గ్రామంలో హైదరాబాద్ టు ఆత్మకూరు వయా వడ్డెమాన్ దమగ్నాపూర్, సీతారంపేట్ గ్రామాల మధ్య బస్సు సర్వీసును ప్రారంభించారు. ఏంఈవో మురళీకృష్ణ, నాయకులు నరేందర్రెడ్డి, శివకుమార్, రాఘవేందర్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, సురేష్, శేఖర్ పాల్గొన్నారు.