ప్రతీ దరఖాస్తు ఆన్లైన్ చేయాలి
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:43 PM
రైతుల నుంచి వచ్చే ప్రతీ దరఖాస్తును ఆన్లైన్ చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

- పుల్లూరు రైతు సదస్సులో జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
అలంపూరుచౌరస్తా, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి వచ్చే ప్రతీ దరఖాస్తును ఆన్లైన్ చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం ఆయన అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనా రాయణ, ఆర్డీవో అలివేలుతో కలిసి ఉండవల్లి మండలం పుల్లూరులో జరుగుతున్న రైతు సదస్సులో పాల్గొన్నారు. తహసీల్దారు ప్రభాకర్కు పలు సూచనలు చేశారు. భూ సమస్యల ఫిర్యాదులపై ఆరాతీశారు. దరఖాస్తుల స్వీకరణ విధా నం, అందజేస్తున్న రశీదులపరంగా సమస్యల ను తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. భూభారతి సదస్సులను రైతులు వినియోగించుకోవాలని చెప్పారు.