కురుమూర్తి ఆలయ అభివృద్ధకి కృషి
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:29 PM
కురుమూర్తి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇందుకోసం ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డికి గతంలోనే వివరించినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి అన్నారు.

- ఏడాదిలోపు ఘాట్రోడ్డు పనులు పూర్తి
- ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి
చిన్నచింతకుంట, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : కురుమూర్తి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇందుకోసం ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డికి గతంలోనే వివరించినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.110 కోట్ల వ్యయంతో నిర్మించే ఘాట్రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. అడిగిందే తడువుగా ఘాట్రోడ్డు పనులకు సీఎం రూ.110 కోట్లు మంజూరు చేయడం సంతోషకరం అన్నారు. ఏడాదిలోపు ఘాట్రోడ్డు పనులు పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్నకాలంలో కురుమూర్తి ఆలయ ప్రాంగణంలోనూ, జాతర మైదానంలో కాటేజీలు, కల్యాణ మండపం వంటి అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణాసుధాకర్రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్కుమార్రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, టీపీసీసీ నాయకులు సాంబయ్య, భాస్కర్యాదవ్, పాలకవర్గం సభ్యుడు భాస్కరాచారీ, ఆర్అండ్బీ డీఈ సంధ్య, ఏఈఈ రాజేష్, శ్రీరామ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, ప్రదీప్రెడ్డి, శివకుమార్, రంజిత్రెడ్డి, వెంకటేష్, జీజీ పౌలు, శేఖర్, ప్రతాప్, వెంకటేష్, దామోదర్ పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
దేవరకద్ర : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే జీ.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం కౌకుంట్ల మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు పంపిణీ చేసి, భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎండోమెంట్ నిధులు రూ.40 లక్షలతో శివాలయ పునఃనిర్మాణానికి భూమిపూజ చేశారు.