సఫారీ పర్యాటకులకు కనువిందు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:31 PM
నాగ ర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో సఫారీ టూర్ వెళుతున్న టూరి స్టులకు కనువిందు గొలిపేలా నాలుగు చిరు తలు, ఓ పెద్దపులి కనిపించాయి.

- కనిపించిన నాలుగు చిరుతలు, ఒక పెద్దపులి
మన్ననూర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నాగ ర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో సఫారీ టూర్ వెళుతున్న టూరి స్టులకు కనువిందు గొలిపేలా నాలుగు చిరు తలు, ఓ పెద్దపులి కనిపించాయి. వేర్వేరుగా శనివారం వీటి దర్శన భాగ్యం కలిగింది. శని వారం ఉదయం షికారీ ఘర్ ప్రాంతంలో ఓ పెద్దపులి కనిపించగా, సాయంత్రం నాలుగు చిరుత పులులు కనిపించాయి. చిరుత పులు లను చూసిన పర్యాటకుల ఆనందానికి అవ ధుల్లేకుండా పోయాయి. తమ ఫోన్లలో చిరు త పులులు సంచరించే వీడియోలను చిత్రీక రించుకొని సంబరపడిపోయారు. శనివారం సాయంత్రం కనిపించిన నాలుగు చిరుత పు లులు ఫర్హాబాద్ నుంచి గుండం వెళ్లే దారిలో వేర్వేరుగా కనిపించినట్లు అటవీ సెక్షన్ అధి కారి శ్రీకాంత్ తెలిపారు.
పెద్దపులిని ప్రత్యక్ష్యంగా చూసి..
అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాం తంలో శనివారం ఉదయం సఫారీ పర్యాటకు లకు పెద్దపులి కనిపించి కనువిందు చేసింది. ఫర్హాబాద్ చౌరస్తా నుంచి సఫారీ వాహనం లో వ్యూ పాయింట్ వైపు వెళుతున్న పర్యాట కులకు పాత నిజాం నవాబు బంగ్లా (శిఖారి ఘర్) వద్ద రహదారిపై దర్జాగా నడుచుకుం టూ వెళుతున్న పెద్దపులి ప్రత్యక్షమైంది. పెద్ద పులిని గమనించిన సఫారీ డ్రైవర్ వాహనా న్ని నిలిపివేసి పర్యాటకులకు చూయించాడు. పర్యాటకులు ఓ వైపు భయం, మరో వైపు సంతోషంతో తమ వద్ద ఉన్న ఫోన్లో పెద్దపు లి సంచరించే దృశ్యాలను చిత్రీకరించారు. ప ర్యాటకులతో పాటుగా, అటవీ అధికారులు సై తం పెద్దపులి సంచరించే దృశ్యాలను సామా జిక మాధ్యమాల్లోకి పంపించుకున్నారు. మూ డు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో చిరుతపు లి సఫారీ టూర్కు వెళ్లే పర్యాటకులకు కని పించగా, తాజాగా శనివారం ఉదయం అదే ప్రాంతంలో పెద్దపులి కనిపించింది. ఇటీవలి కాలంలో నల్లమలలో తరచూ వ ర్షాలు కురవడంతో అడవిలో చెట్లన్నీ ఆకుప చ్చగా మారాయి. ఎండ వేడి తగ్గి వాతావర ణం చల్లబడటంతో ఉదయం, రాత్రి వేళల్లో ఓ వైపు పెద్దపులులు, మరోవైపు చిరుత పు లులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అమ్రాబా ద్ అభయారణ్య ప్రాంతంలో ప్లాస్టిక్ నిషేధం చేయడం, వన్యప్రాణుల సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించగా పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంఖ్య ప్రతీ ఏటా క్రమే పీ పెరుగుతోంది. పెద్దపులులకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు సంతానోత్పత్తి జరిపే సమయం కా నుండటంతో అడవిలో తరచూ పె ద్దపులు లు, చిరుతలు సంచరిస్తున్నాయి. నల్ల మల లో ఊటి మాదిరి వాతావరణం, పెద్దపు లిని చూడొచ్చన్న ఆశతో నల్లమల టైగర్ సఫారీకి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.