Share News

సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని తాకిన కృష్ణమ్మ

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:04 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద సప్తనదుల ప్రదేశంలో కొలువైన సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని కృష్ణానది జలాలు తాకాయి. మరో నాలుగు రోజుల్లో ఆలయం పూర్తిగా జలాధివాసం కానుంది.

సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని తాకిన కృష్ణమ్మ

  • మరో 4 రోజుల్లో జలాధివాసం కానున్న ఆలయం

కొల్లాపూర్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద సప్తనదుల ప్రదేశంలో కొలువైన సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని కృష్ణానది జలాలు తాకాయి. మరో నాలుగు రోజుల్లో ఆలయం పూర్తిగా జలాధివాసం కానుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈ ఏడాది ముందుగానే కృష్ణానదిలోకి వరద జలాలు చేరాయి.


కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు వెళ్లడంతో ఎంతో విశిష్టమైన వేపధారు శివలింగానికి చివరిసారిగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఆరు నెలల తరువాతే ఆలయం తిరిగి భక్తులకు దర్శనం ఇవ్వనుండడంతో, భక్తులు ఆలయం గోపురాన్ని దర్శించుకుంటున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 04:04 AM