Share News

Konda Surekha: ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలి: సురేఖ

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:10 AM

ప్రపంచానికి సవాలుగా మారిన ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రభుత్వం, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ

Konda Surekha: ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలి: సురేఖ

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచానికి సవాలుగా మారిన ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రభుత్వం, ప్రజలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరం ‘ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చేయడం’ అనే థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నామన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 03:10 AM