Share News

Kishan Reddy: కుటుంబ డ్రామాల్లో.. బీజేపీ పాత్రధారి, సూత్రధారి కాదు

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:51 AM

రాష్ట్రంలో రాజకీయ, కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి, సూత్రధారి కాదని స్పష్టం చేశారు.

Kishan Reddy: కుటుంబ డ్రామాల్లో.. బీజేపీ  పాత్రధారి, సూత్రధారి కాదు

  • ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బు కోసం బీఆర్‌ఎస్‌ పార్టీలో గొడవలు

  • కాంగ్రెస్‌ హయాంలో అవినీతి వికేంద్రీకృతం.. రేవంత్‌ హామీలేమయ్యాయి?: కిషన్‌రెడ్డి

  • బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనంపై ఎప్పుడూ చర్చ జరగలేదు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌/సుభా్‌షనగర్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ, కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి, సూత్రధారి కాదని స్పష్టం చేశారు. ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బుల కోసం బీఆర్‌ఎ్‌సలో గొడవలు జరుగుతున్నాయని, వాటితో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి కేంద్రీకృతం కాగా, కాంగ్రెస్‌ హయాంలో వికేంద్రీకృతం అయిందని విమర్శించారు. వందలాది మంది బలిదానంతో తెలంగాణను సాధించుకున్నది కేసీఆర్‌ కుటుంబం, కాంగ్రెస్‌ నాయకులు దోచుకోవడానికా..? అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాల వైఖరి వల్ల రూ.10లక్షల కోట్ల అప్పు అయిందని, ఒక్క సింగరేణికే సర్కారు రూ.42వేల కోట్లు బాకీ ఉందని పేర్కొన్నారు. పాల నా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌ పాకిస్థాన్‌తో యుద్ధం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీల అమలు ఏమైందో రేవంత్‌ మాట్లాడరని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.


బీఆర్‌ఎస్‌విలీనంపై కేసీఆర్‌ను అడగాలి: లక్ష్మణ్‌

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ ఎప్పుడూ చర్చకు రాలేదని, విలీనం సంగతిని కేసీఆర్‌నే అడగాలని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. అధికారంలో ఉన్నప్పు డు కాంగ్రెస్‌ కులగణనపై మాట్లాడలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది గుర్తుకు వస్తుందన్నారు. నిజా మాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం లక్ష్మ ణ్‌ మీడియాతో మాట్లాడారు. కులగణనపై మోదీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.


మహేశ్‌ గౌడ్‌ కేసీఆర్‌ కోవర్టు

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌.. కేసీఆర్‌ కోవర్టు అని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రామారావు పటేల్‌ మండిపడ్డారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ భరోసా పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతీరోజు ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఒక ముఖ్య నేత రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. తొలిరోజు సోమవారం ఎంపీ ఈటల ఉంటారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 02 , 2025 | 03:51 AM