Kishan Reddy: బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
ABN , Publish Date - May 28 , 2025 | 05:29 PM
పార్టీ కార్యాలయాన్ని వ్యక్తి గత అవసరాలకు వాడుకుంటే ఊరుకోమని తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఆఫీసులో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని సూచించారు. ఇకపై..

తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ముఖ్యనేతలతో సమావేశమై నేతలకు క్లాస్ ఇచ్చారు. కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాలో పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషనలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనుమతి తప్పనిసరి
పార్టీ కార్యాలయాన్ని వ్యక్తి గత అవసరాలకు వాడుకుంటే ఊరుకునేది లేదని నేతలకు గట్టిగా చెప్పారు. పార్టీ ఆఫీసులో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని సూచించారు. ఇక మీదట ప్రెస్ మీట్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇది తనతో పాటు అందరికీ వర్తిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ నేతలు హూందాగా ప్రవర్తించాలని సూచించారు.
పోరాటం చేయాలి
బీజేపీ అంటే బాధ్యతగల పార్టీ అని సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని కీలక వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ ఆఫీస్ను ఆశ్రయిస్తున్నారని.. అలాంటి వారికి న్యాయం చేసేలా నేతలు పోరాటం చేయాలని సూచించారు. అలా కాకుండా, ఇష్టం వచ్చినట్లు ప్రెస్మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
ఏ పంటకు ఎంత మద్దతు ధర పెంచారంటే..
For More Telugu And National News