Bhū Bhārati: భూ భారతి సర్వేను ప్రారంభించిన మంత్రులు
ABN , Publish Date - Jun 03 , 2025 | 01:02 PM
Bhu Bharati land survey: దొంగ పాస్ బుక్లకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడిందని, చెరువులు రహదారులు డొంకలు అన్నీ అక్రమణకు గురయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చేప్పామని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు భూ భారతి తెచ్చామని మంత్రి చెప్పారు.

ఖమ్మం జిల్లా: మధిర నియోజక వర్గం (Madira constituency), ఎర్రుపాలెం మండలం, ములుగుమాడులో మంగళవారం భూ భారతి సర్వే (Bhu Bharati land survey)ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Minister Tummala Nageswararao), రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఇది పవిత్ర మైన కార్యక్రమమని, ఇది శుభసూచకమని, ఇదొక విప్లవాత్మకమైన కార్యక్రమమని అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.
మంత్రి పొంగులేటి చరిత్రలో నిలచిపోతారు..
దొంగ పాస్ బుక్లకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడిందని, చెరువులు రహదారులు డొంకలు అన్నీ ఆక్రమణకు గురయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు భూ భారతి తెచ్చామని మంత్రి చెప్పారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దేశ చరిత్రలో నిలచిపోతారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చారని, తమకు రాజకీయం, అధికారం శాశ్వతం కాదని, ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ముఖ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శాశ్వత పరిష్కారం భూభారతి..
దేశంలోనే తెలంగాణను అగ్రభాగంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని, ప్రజలు ఇచ్చిన శక్తి, ధైర్యంతో ముందుకు వెళుతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖలో ఉన్న ఇబ్బందులు కష్టాలు ఈ భూ భారతి చట్టంతో పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. భూ సమస్యలన్నింటికీ భూ భారతి శాశ్వత పరిష్కారమని అన్నారు. అసాధ్యమైన వ్యవస్దలను సరిదిద్దుకుంటూనే సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామన్నారు. గత పాలకుల హాయాంలో ఆర్థిక విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూనే సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతాంగానికి రూ. 36 వేల కోట్లు వారి అకౌంట్లలో వేశామన్నారు. అనవసరమైన ఖర్చులు తగ్గించి క్రమశిక్షణతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనేది తమ అందరి కోరిక అని, నిక్కచ్చిగా నిర్భీతిగా ధైర్యంగా పాలన చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రహదారుల నిర్మాణం, విశాలమైన రహదారుల నిర్మాణంతో అభివృద్ది సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. దేశచరిత్రలో భూ భారతి చట్టం నిలవబోతోందని, భారత దేశంలో అత్యధిక పంట పండించింది తెలంగాణ రైతాంగమని, దేశానికి అన్నం పట్టేది రైతాంగమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కారులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం..
2కె రన్లో పాల్గొన్న ‘భైరవం’ చిత్రం యూనిట్
For More AP News and Telugu News