Revanth Reddy : కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ABN , Publish Date - May 25 , 2025 | 08:25 PM
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీ నూతన కార్యవర్గ ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీ నూతన కార్యవర్గ ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. తాజాగా మరోసారి ఈ విషయంపై కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.