విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:47 AM
కార్పొరేట్, ప్రైవేటు పాఠ శాలలో ఫీజులు నియంత్రణపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు.

సిరిసిల్ల టౌన్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్, ప్రైవేటు పాఠ శాలలో ఫీజులు నియంత్రణపై నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణం ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు మండల స్థాయికి విస్తరించి ఇష్టారాజ్యంగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేద, మధ్యతరగతి తల్లిదం డ్రుల కష్టార్జితాన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జలగల్లా పట్టి రక్తాన్ని పీలుస్తున్నాయన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠ శాలలో ఒకటవ తరగతికి సంవత్సరానికి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతూ నిబంధనాలకు వ్యతిరేకవంగా వ్యవహరిస్తున్నప్పటికి జిల్లా విద్యాశాఖ అధికారులు చూసీచూడటన ట్లు వ్యవహరించడంలో ఆతర్యం ఏంటని ప్రశ్నించారు. పాఠశాల యా జమాన్యాలు బయటి బుక్స్టాల్స్ యజమానులతో కుమ్ముకై ముందే పర్సంటేజ్లు మాట్లాడుకొని పాఠశాల యాజమాన్యం ఆ బుక్ స్టాల్కు విద్యార్థుల తల్లిదండ్రులను పంపిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించా రు. జిల్లా కేంద్రంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఇష్టాను సారంగా ఫీజులు పెంచుకుంటు పోతున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన పాఠ్య పుస్తకాలు కాకుండు పాఠశాల యాజమాన్యాం రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధనలు చేస్తూ ఆ పాఠ్యపుస్తకాలను కొనాలని చెప్పి ఫీజులు, పుస్తకాలకు లింకులు పెడుతూ దోపిడికి పాల్పడుతు న్నాయని ఆరోపించారు. నిబంధనాల ప్రకారం ప్రభుత్వం రూపొందిం చిన పరీక్ష పత్రాలతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పాఠశాలల యాజమాన్యాలు రూపొందించిన పరీక్ష పత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్న విద్యాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వీ సిరిసిల్ల పట్టణ ఇంచార్జి ఎస్కె బాబా, మెట్టల సాయిదీపక్, వలబొజు వెంకటరమణ, కనుకుంట్ల వెంకటర మణ, అశోక్ పాల్గొన్నారు.