మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:45 AM
మండలానికి ఒక క్రీడా మైదా నం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

చందుర్తి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలానికి ఒక క్రీడా మైదా నం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలే జ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో శుక్రవారం ఆది శ్రీనివాస్ అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సంద ర్భంగా అయన మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు. గతంలో విద్యార్థి దశలో ఉన్న సమయం లో కోర్టు లైన్పోసే వాడినని అప్పటి రోజులను గుర్తుచేశారు. క్రీడాకా రులకు తనవంతు సహాయసహారాలు ఉంటాయన్నారు. రానున్న రో జుల్లో రాష్ట్రస్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన ప్రో త్సాహకం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సి టీని ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్య లు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియంలను మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూశామని తెలి పారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, నాయ కులు చింతపంటి రామస్వామి, పుల్కం మోహన్, ఏసుదాసు తదిత రులు పాల్గొన్నారు.