Share News

JNTU: జేఎన్‌టీయూలో విశ్వేశ్వరయ్య పీహెచ్‌ డీ స్కీమ్‌

ABN , Publish Date - May 03 , 2025 | 04:18 AM

కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌(డీఐసీ) ప్రవేశపెట్టిన విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీమ్‌కు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఎంపికైంది.

JNTU: జేఎన్‌టీయూలో విశ్వేశ్వరయ్య పీహెచ్‌ డీ స్కీమ్‌

  • ఇద్దరు ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ స్కాలర్లకు ఫెలోషిప్‌

హైదరాబాద్‌ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌(డీఐసీ) ప్రవేశపెట్టిన విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీమ్‌కు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఎంపికైంది. ఈమేరకు పరిశోధనలు(పీహెచ్‌డీ) చేసే వారికి ఫెలోషిప్‌, ఆర్థిక తోడ్పాటును అందిస్తారు. విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీమ్‌ ఫర్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ: ఫేజ్‌1ను జేఎన్‌టీయూలో అమలు చేసేందుకు డీఐసీ పీహెచ్‌డీ సెల్‌ ఇన్‌చార్జ్‌ సుదీ్‌పకుమార్‌ బన్సల్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.


2025-26 విద్యా సంవత్సరానికి జేఎన్‌టీయూలో ఈ స్కీమ్‌ కింద ఇద్దరు ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ స్కాలర్లకు ఫెలోషి్‌పను అందజేయనున్నారు. వీరికి ఐదేళ్ల వ్యవధిలో రూ.76,62,400 అందజేయనున్నారు. విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీమ్‌ కింద దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో పరిశోధనలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

Updated Date - May 03 , 2025 | 04:18 AM