Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:45 AM
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనిసవాసరెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు.

ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎ్సకు లేదు: మంత్రి పొంగులేటి
ఖమ్మం రూరల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనిసవాసరెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఏదులాపురం మునిసిపాలిటిలోని ఓ ఫంక్షన్హల్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఊకదంపుడు ఉపన్యాసాలు, కాలయాపన కబుర్లు చెపితే ప్రజలు నమ్మరన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారు కట్టుకున్న ప్యాలె్సలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నివసించే బంగ్లాల మీద పెట్టిన ఖర్చు, శ్రద్ధ పేదవారి ఇళ్ల మీద ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఖర్చు పెట్టే రూపాయి పేదవారికి చెందుతుందా లేదా అని ఆలోచించాలనే ఇంగితజ్ఞానం కేసీఆర్కు లేదని విమర్శించారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్న ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎఎస్ మీడియాలో పిట్ట కథలు రాసుకుంటే ఒరిగేది ఏమిలేదన్నారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి