Jawahar Nagar lift: డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టు లిఫ్ట్ తెగి ముగ్గురు మృతి
ABN , Publish Date - May 07 , 2025 | 08:46 PM
సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో పవర్ ప్రాజెక్టు రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు..

Jawahar Nagar Power Project lift: : సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో పవర్ ప్రాజెక్టు రెండవ దశ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. డంపింగ్ యార్డ్ లో పవర్ ప్రాజెక్టు లో భాగంగా చిమ్నీలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పవర్ ప్లాంట్ కు సంబంధించిన లిఫ్టు ఒక్కసారిగా కూలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఉదయం(బుధవారం) జరిగిన ఘటనలో ఉత్తరప్రదేశ్ కు చెందిన సురేష్ సర్కార్, ప్రకాష్ మండల్, అమిత్రాయ్ లు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటన జరిగిన వెంటనే ముగ్గురిని హుటాహుటిన ఈసీఐఎల్ లోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
Former CM Jagan: లిక్కర్ స్కాం కేసులో జగన్ బ్యాచ్కు హైకోర్టు నుంచి నిరాశ..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News