NTR 102nd Birth Anniversary..జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళి
ABN , Publish Date - May 28 , 2025 | 08:56 AM
NTR 102nd birth anniversary: దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన మనుమలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బుధవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని తాతకు ఘనంగా నివాళులర్పించారు.

హైదరాబాద్: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 102వ జయంతి (102nd birth anniversary) సందర్భంగా బుధవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) ఘనంగా నివాళులర్పించారు (Tributes). ఈ సందర్బంగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. కాగా ఎన్టీఆర్కు నివాళులర్పించేందుకు ప్రముఖులు వస్తున్న సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అధికారికంగా ఎన్టీఆర్ జయంతి..
కాగా మే 28వ తేదీ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవోఎంఎస్ నెంబర్ 54ను జారీ చేశారు. ఎన్టీఆర్ అసాధారణ జీవితం, దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్పై తిరుగులేని ముద్రవేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆయన తెలుగువారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచారని, ప్రజలకు, సినీ, రాజకీయ రంగాలకు ఎంతో సేవ చేశారని పేర్కొంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని ‘రాష్ట్ర స్థాయి వేడుకగా’ జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తూ ఈ మేరకు జీవో జారీ చేసింది.
Also Read: వర్షపు నీటిలో మునిగి వ్యక్తి మృతి..
ఎన్టీఆర్ గతంలో చేసిన మంచి పనులు..
కాగా సైనికుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ గతంలో చేసిన ఓ మంచి పనిని సమాజానికి గుర్తు చేసుకుంది. 1965 పాకిస్థాన్తో యుద్ధం సమయంలో మన సైనికుల సంక్షేమం కోసం తనవంతు బాధ్యత నెరవేర్చేందుకు నడుం బిగించిన ఎన్టీఆర్ జనాల్లోకి వెళ్లారు. విరాళాలు సేకరించి జాతీయ రక్షణ నిధికి అందించారు. అలాగే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను పట్టి కుదిపేస్తున్న థియేటర్ల వ్యవహారం కాస్తా రచ్చకెక్కిన విషయం చూస్తున్నాం. కానీ తన నాయకత్వ ప్రతిభతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏకతాటిపై నడిపించారు. పరిశ్రమకు ఏ ఇబ్బంది వచ్చినా పెద్దదిక్కుగా ఉండి పరిష్కరించడంలో ముందుండేవారు. కానీ, ఇప్పుడు ఆ నాటి ఎన్టీఆర్ స్ఫూర్తి ఏదీ.. ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది చాలాకాలంగా వినిపిస్తోంది. దీనివల్ల సింగిల్ స్క్రీన్ల నిర్వహణ భారంగా మారి పెద్ద సంఖ్యలో థియేటర్లు మూతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అన్న ఎన్టీఆర్నే పరిశ్రమ గుర్తుచేసుకుంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దనరెడ్డి బెంగళూరుకు తరలింపు
For More AP News and Telugu News