Corona: తెలంగాణలో కోవిడ్ 19.. కూకట్పల్లిలో డాక్టర్కు పాజిటివ్.. బి కేర్ ఫుల్
ABN , Publish Date - May 23 , 2025 | 06:04 PM
యావత్ ప్రపంచాన్నీ వైరస్తో వణికించిన కోవిడ్ 19 మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడా కోవిడ్ 19 మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా..

ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచాన్నీ వైరస్తో వణికించిన కోవిడ్ 19 మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడా కరోనా మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణలో కోవిడ్ 19 కేసు నమోదు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక డాక్టర్కు కోవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కోవిడ్ 19 వైరస్ (కోవిడ్ 19) తెలంగాణలో మొదటి సారిగా 2020 మార్చి 2న తొలి కోవిడ్ 19 వైరస్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ 19 వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వైరస్ కేసులు లక్షల్లో నమోదుకావడం, రెండు సార్లు లాక్ డౌన్లతో మొత్తం జనజీవనం స్థంభంచిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ 19తో కకావికలమైంది. ఎటు చూసినా శవాల కుప్పలు కనిపించాయి.
ఇలా ఉండగా, ఢిల్లీలో 23 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. దేశ రాజధానిలోని ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల లభ్యతను నిర్ధారించుకోవాలని ఢిల్లీ సర్కారు శుక్రవారం కోవిడ్-19 వ్యాధిపై అప్రమత్తత ప్రకటించింది.
ఇవీ చదవండి:
భారత సైన్యాన్ని మెచ్చుకున్న అమిత్ షా
ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి