Share News

Gali Janardhan Reddy: సీబీఐ కోర్టు తీర్పును కొట్టేయండి

ABN , Publish Date - May 20 , 2025 | 04:56 AM

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో ిసీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ దోషులుగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి, ఇతర నిందితులు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

Gali Janardhan Reddy: సీబీఐ కోర్టు తీర్పును కొట్టేయండి

  • హైకోర్టులో గాలి జనార్దన్‌ రెడ్డి, తదితరుల అప్పీల్‌

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో ిసీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ దోషులుగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి, ఇతర నిందితులు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్‌ చేసి తమకు బెయిల్‌ మంజూరు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.


ఏ1 శ్రీనివా్‌సరెడ్డితో పాటు ఏ2 మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏ7 అలీ ఖాన్‌లను కోర్టు దోషులుగా తేల్చింది. ఓఎంసీ కంపెనీకి జరిమానా.. నిందితులకు ఏడేళ్ల పాటు శిక్షను విధించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్‌ కృపానందలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ పిటిషన్లు ఈనెల 21న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఎదుట విచారణకు రానున్నాయి.

Updated Date - May 20 , 2025 | 04:56 AM