Fire Accident: శ్రీశైలం అగ్నిప్రమాదం..
ABN , Publish Date - May 24 , 2025 | 03:30 AM
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు శుక్రవారం ఓ లేఖ రాశారు. చీఫ్ ఇంజనీర్లు ఎం.ప్రభాకర్, బి.సురే్షను ప్రమాదానికి కారకులుగా గుర్తించినా ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు.
9 మంది కాలి బూడిదవడమే కాకుండా ఒక యూనిట్ పూర్తిగా ధ్వంసమై ఇప్పటివరకు బాగుపడలేదన్నారు. ఇప్పటికైనా నిందితులను శిక్షించి చనిపోయిన వారి ఆత్మలు శాంతించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బాధితులు పేర్కొన్నారు.