Jupally Krishna Rao: పది రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:46 AM
రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

ఎక్సైజ్ అధికారులతో మంత్రి జూపల్లి
రాబోయే పది రోజుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయంలో సోమవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో దాదాపు 15 ఏళ్లుగా బదిలీలు జరగలేదు. దీంతో ఆ విషయంపై చర్చించారు. పదోన్నతులతో సంబంధం లేకుండా పది రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రి ఆదేశించడంతో.. పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.