Share News

CPI Narayana: అందాల భామల వెంట సొల్లుకార్చుకుంటూ తిరుగుతున్న మంత్రులు

ABN , Publish Date - May 21 , 2025 | 06:42 AM

ప్రపంచ సుందరి పోటీల పేరిట మంత్రులు అవాంఛిత ప్రవర్తనలో ఉన్నారంటూ సీపీఐ నేత నారాయణ తీవ్రంగా విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను డిఫ్యాక్టో ప్రధాని, మోదీని డమ్మీగా అభివర్ణిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎద్దేవా చేశారు.

CPI Narayana: అందాల భామల వెంట సొల్లుకార్చుకుంటూ తిరుగుతున్న మంత్రులు

  • ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేది ఇందుకేనా?

  • దేశానికి డిఫ్యాక్టో ప్రధానిలా ట్రంప్‌: నారాయణ

హైదరాబాద్‌, మే20(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరం అంతా ఇప్పుడు అందాల భామల చుట్టూ తిరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. భామల వెంట మంత్రులంతా సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారన్నారని ఆయన వ్యాఖ్యానించారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేది సొల్లుకార్చుకోడానికా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మన దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డిఫ్యాక్టో ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారని, మోదీ డమ్మీ ప్రధానిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలను మోదీ పాటించడం దేశానికి అవమానకరమని నారాయణ అన్నారు. కాగా, అపరేషన్‌ కగార్‌ పేరుతో ఎంతమంది మావోయిస్టులను చంపేశారో, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. కగార్‌ ఆపరేషన్‌లో తెలంగాణ పోలీసులు కూడా పాల్గొంటున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా తెలపాలని కోరారు. అసెంబ్లీ ఎదురుగా ప్రకాశం పంతులు విగ్రహం అనాథలా ఉందని, దానిని మరో ముఖ్యమైన ప్రాంతానికి మార్చాలని సీఎం రేవంత్‌ను కూనంనేని కోరారు. ధర్మభిక్షం పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 21 , 2025 | 06:42 AM