Nitin Gadkari: సోమశిల నుంచి సిద్దేశ్వరానికి కేబుల్ బ్రిడ్జిని మంజూరు చేయండి..
ABN , Publish Date - May 06 , 2025 | 05:11 AM
సోమశిల నుంచి సిద్దేశ్వరానికి కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీలు కోరారు.

గడ్కరీని కోరిన కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): సోమశిల నుంచి సిద్దేశ్వరానికి కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీలు కోరారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్కు వచ్చిన గడ్కరీని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, సురేశ్ షెట్కార్, బలరాం నాయక్, రఘువీర్రెడ్డి కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ‘అలంపూర్ క్రాస్ రోడ్డు నుంచి నల్లగొండ, గద్వాల నుంచి రాయ్చూర్ వరకు జాతీయ రహదారులు మంజూరు చేయాలి.
మద్దిమడుగు నుంచి ఏపీలోని మాచర్ల మీదుగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించాలి. యాదగిరిగుట్ట కారిడార్ను అభివృద్ధి చేయాలి’ అని ఎంపీలు కోరారు. తమ ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని చామల ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News