Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి రూ.వేల కోట్లు ఇస్తున్నాం
ABN , Publish Date - May 19 , 2025 | 04:05 AM
తెలంగాణ అభివృద్ధికి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నా. రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

రేవంత్ సర్కారు పూర్తిగా సహకరించడం లేదు: బండి సంజయ్
కరీంనగర్ రూరల్, మే 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అభివృద్ధికి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నా. రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఏం చేసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారుల అభివృద్ధి పనులు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సం జయ్ మీడియాతో మాట్లాడుతూ. ఒక్క జాతీయ రహదారులకే కేంద్రం ఇప్పటి వరకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
తెలంగాణకు కేటాయించిన నిధులు, చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదలకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.33 వేల కోట్లు వెచ్చించగా, ఈ ఒక్క ఏడాదే రూ.5 వేల కోట్లు కేటాయించామని చెప్పా రు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆఽధునీకరణకు 33.3 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ నెల 22న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారని, వాటిలో రా ష్ట్రంలోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టే షన్లు ఉన్నాయన్నారు. కరీంనగర్ నుంచి జగిత్యా ల వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల టెం డర్లు 3 నెలల్లో పూర్తవుతాయని, దీనిపై కేంద్ర మంత్రి గడ్కరీతో ఇటీవల మాట్లాడానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News