Share News

BP: గుండెపై గురి పెడుతున్న రక్తపోటు... ఆరోగ్య భారతావనిలో సగం మందికి ముప్పు

ABN , Publish Date - May 17 , 2025 | 03:08 AM

ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రులు దేశంలో పెరుగుతున్న రక్తపోటు సమస్యపై దృష్టి సారించాయి. దాదాపు 30 శాతం మంది భారతీయ వయోజనులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి.

BP: గుండెపై గురి పెడుతున్న రక్తపోటు... ఆరోగ్య భారతావనిలో సగం మందికి ముప్పు

హైదరాబాద్: ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రులు దేశంలో పెరుగుతున్న రక్తపోటు సమస్యపై దృష్టి సారించాయి. దాదాపు 30 శాతం మంది భారతీయ వయోజనులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్, అకాల మరణాలకు ప్రధాన కారణమవుతోందని తెలిపింది. ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, చాలా మందికి తమకు రక్తపోటు ఉందనే విషయం తెలియడం లేదని, ఇది జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని పేర్కొంది.


భారత్‌లో పెరుగుతున్న రక్తపోటు భారం..

తాజా అధ్యయనాల ప్రకారం, దాదాపు 30 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు సగం మందికి తమ పరిస్థితి గురించి అవగాహన లేదు. ముఖ్యంగా యువకుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. 2024లో 45 ఏళ్లలోపు వారిలో 26 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ, "భారత్ అనేక ఆరోగ్య సంక్షోభాలను అధిగమించింది. ప్రతి విజయం అవగాహన, సామూహిక ప్రయత్నం ద్వారానే సాధ్యమైంది. అపోలో హాస్పిటల్స్‌లో, నివారణే మొదటి సూచన అని మేము నమ్ముతాము. అపోలో ప్రోహెల్త్ వంటి కార్యక్రమాల ద్వారా, మేము 2.5 కోట్ల స్క్రీనింగ్‌లను నిర్వహిస్తున్నాం. రక్తపోటు పర్యవేక్షణను మెరుగుపరచడం, విధానపరమైన మద్దతును బలోపేతం చేయడం, సాధారణ స్క్రీనింగ్‌లను జాతీయ ప్రాధాన్యతగా మార్చడం మా లక్ష్యం. ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలని మేము కోరుకుంటున్నాము" అని అన్నారు.


ముఖ్యంగా హైదరాబాద్ (68%), ఢిల్లీ (65%), చెన్నై (63%) వంటి ప్రధాన నగరాల్లో రక్తపోటు వ్యాప్తి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది దీర్ఘకాలిక ఒత్తిడి, నిశ్చలమైన జీవనశైలి వంటి 'పట్టణ జీవనశైలి' గుండె సంబంధిత ప్రమాదాలను పెంచుతోందని సూచిస్తోంది. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ, "రక్తపోటు వయస్సు లేదా జన్యుపరమైన కారణాలకు మాత్రమే పరిమితమైన వ్యాధి కాదు. ఇది యువ పట్టణ జనాభాలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న మహమ్మారిగా మారుతోంది. కేవలం రక్తపోటును కొలవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి సమగ్ర హృదయ సంబంధిత ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం సవాలు. మనం కేవలం కొన్ని కొలమానాలపై దృష్టి పెట్టకుండా, బయోమార్కర్ల సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలి. స్వల్ప అసమతుల్యతలు కూడా తీవ్రమైన అంతర్లీన పరిస్థితులకు ప్రారంభ సంకేతాలు కావచ్చు" అని అన్నారు.


నివారణ మార్గాలు...

ఉప్పు తీసుకోవడం తగ్గించడం, శారీరక శ్రమ పెంచడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా రక్తపోటు వల్ల వచ్చే 80 శాతం గుండెపోటులు, పక్షవాతాలను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:08 AM