Tummala: బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్త పాలన
ABN , Publish Date - May 31 , 2025 | 05:23 AM
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రాజకీయ, ఆర్థిక సమస్యలున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి సమస్యలను పరిష్కరించుకుంటూ మందుకు సాగుతున్నామని చెప్పారు.

రేవంత్ పాలనలో సమస్యలు పరిష్కారం: తుమ్మల
అధికారులు అవినీతికి దూరంగా ఉండాలి: ఉత్తమ్
సన్నబియ్యంతో సర్కారుకు మంచిపేరు: కోమటిరెడ్డి
సూర్యాపేట(కలెక్టరేట్), మే 30(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రాజకీయ, ఆర్థిక సమస్యలున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి సమస్యలను పరిష్కరించుకుంటూ మందుకు సాగుతున్నామని చెప్పారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, భూభారతి, ఇరిగేషన్, ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన నల్లగొండ ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతుభరోసాకు రూ.13వేలకోట్లు, రైతుల రుణమాఫీకి రూ.21వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలన్నారు. తప్పులు చేసే అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. గత పదేళ్లలో అధికారుల అలసత్వం, అవినీతి ఎక్కువగా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిన్నంటినీ విడనాడాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటిని సక్రమంగా అమలు చేయడంలో కలెక్టర్లు ముఖ్యభూమిక పోషించాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో లేకపోయినా సన్నబియ్యం ఇస్తున్నందున ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్