Share News

రాజీమార్గమే రాజమార్గం

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:25 PM

రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్‌ అన్నారు. శనివారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో పాల్గొని రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించారు.

రాజీమార్గమే రాజమార్గం
లోక్‌ అదాలత్‌లో పాల్గొన్న న్యాయమూర్తి అజయ్‌ ఉల్లం

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్‌ అన్నారు. శనివారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో పాల్గొని రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ల ద్వారానే సత్వర న్యాయం లభిస్తుంద న్నారు. కేసులను రాజీ చేసుకోవడం ద్వారా ఇరువర్గాల సమయంతో పాటు డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కక్షిదారు లు రాజీపడదగ్గ క్రిమినల్‌, సివిల్‌, తదితర కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో లోక్‌అదాలత్‌ ద్వారా మొత్తం 3,604 కేసులు పరిష్కరించి, 32,27,050 రూపాయలు జరిమానాలు విధించారు. లోక్‌అదాల త్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ, జూనియ ర్‌ సివిల్‌ జడ్జి అనంత లక్ష్మి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం

సిర్పూర్‌(టి), జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయని సిర్పూర్‌(టి) జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌ ఉల్లం అన్నారు. శనివారం కోర్టు హాల్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. లోక్‌ అదాలత్‌ రాజీమార్గంలో పరిష్కారం అయిన కేసులు మళ్లీ అప్పీల్‌కు పోయే అవకాశం ఉండదన్నారు. అనంతరం చట్టాల పై అవగాహన కల్పించారు. ఈ లోక్‌ అదాలత్‌లో 876 కేసులను రాజీమా ర్గంలో పరిష్కరించి రూ.19,58,800 జరిమానా విధించారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు కళ్యాణ్‌, మతీన్‌, కోర్టు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:25 PM