జిల్లాలో సరిపడా సన్నబియ్యం నిల్వలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:33 PM
జిల్లాలో సన్న బియ్యం నిల్వలు పంపిణీకి సరిపడా ఉన్నాయని, కార్డుదారులు ఆందోళన చెందాల్సినవరం లేదని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సన్న బియ్యం నిల్వలు పంపిణీకి సరిపడా ఉన్నాయని, కార్డుదారులు ఆందోళన చెందాల్సినవరం లేదని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్లోని 5,8 నంబర్ల రేషన్ షాపులను గురువారం కలెక్టర్ సందర్శించి బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కార్డుదారు లతో కలెక్టర్ మాట్లాడారు. పంపిణీ జరుగుతున్న తీరు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబందించిన రేషన్ బియ్యంను ఈ నెల 30వ తేదీ వరకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తామన్నారు. సాంకేతిక సమస్య తలెత్తితే ఈ-పాస్ ఇంజనీర్లు పరిష్కారం చేస్తారని, సజావుగా పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటమన్నారు. సన్న బియ్యం నిల్వలు పంపిణీకి సరిపడా ఉన్నయని, కార్డుదారులు ఆందోళన చెందాల్సినవరం లేదన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉంటుం దని, నిల్వలు అవసరం ఉన్నట్లయితే వెంటనే సంప్ర దిస్తే తక్షణమే సరఫరా చేస్తామని కలెక్టర్ అన్నారు.
- ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు
మంచిర్యాల కలెక్టరేట్: ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుం టున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని నస్పూర్లో గల ఈవీం గోదామును ప్రత్యేక ఉపపాలనాధికారి డి చంద్రకళ, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లా డుతూ ఈవీఎం గోదాంలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సంబంధిత సామగ్రిని భద్రపరిచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. త్రైమాసిక పరిశీనలో భాగంగా అధికారులు, పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎంలను పరిశీలిం చామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవే క్షించడం జరుగుతుందని, భద్రత సిబ్బంది పర్వవేక్షణ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.