‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థికాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:40 PM
ఇందిరా మహి ళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూ య(సీతక్క) అన్నారు.

- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఆసిఫాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఇందిరా మహి ళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూ య(సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, విద్యా శాఖ కమిషనర్ యోగితారాణా, పంచాయతీరాజ్ కమిషనర్ లోకేష్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడు తూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా చేపట్టే కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రెండు మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మహిళా శక్తి భవనాల నిర్మాణా లకు స్థలాలను ఎంపిక చేసి పనులు ప్రారంభించి నవంబరు 30లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిం చారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను కుట్టిస్తున్నామని తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం లోపే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతీ జిల్లాలో పెట్రోల్ బంక్ల నిర్వహణకు స్థలాలు ఎంపిక చేసి అయిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకో వాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చే ర్పించి, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని తెలిపారు
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆర్డీవో లోకేశ్వర్రావు, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 45,293 యూనిఫాంలకు గాను 36,000 యూనిఫాంలు సిద్ధం చేశామని, మిగితా యూనిఫాంలను మూడు రోజుల్లో పూర్తిచేసి పాఠశాల ల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో మహిళా శక్తి భవనం కోసం స్థలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించామని వివరించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్బంక్లు ఏర్పాటుకు ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాల్లో స్థలాన్ని ఎంపిక చేసి భారత్ పెట్రోలియం కంపెనీతో త్వరలో ఒప్పందం పూర్తి చేసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికా రి దత్తారావు, అదనపు అఽధికారి రామకృష్ణ, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శణ్రెడ్డి సూచించారు సోమవారం హైదరాబాద్లోని చీఫ్ ఎలకో్ట్రరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఓటరు జాబితా సవరణ, బూత్ స్థాయి అదికారుల నియామకం, గుర్తింపు కార్డుల జారీ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. 1200 ఓటరు దాటిన పోలింగ్ కేంద్రాల్లో సహాయక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం అవసరమైన భవనం, ప్రదేశం, బూత్ స్థాయి అధికారుల నియామక ప్రక్రియను ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజక వర్గాల్లో 1200 మంది ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 30 వరకు ఉన్నాయ ని రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో 678 మంది బూత్స్థాయి అధికారులు పనిచేస్తున్నారని 68 మంది బూత్స్థాయి అధికారుల సూపర్వైజర్లు పనిచేస్తున్నారని మిగితా అధికారుల ఖాళీలను త్వరగా భర్తీ చేస్తామని, బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డు లు జారీ చేస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికా రులు తదితరులు పాల్గొన్నారు.