Share News

జిల్లాలో గాలివాన బీభత్సం

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:41 PM

మంగళవారం రాత్రి వీచిన గాలిభీభత్సవానికి చెట్లు విరిగిపోయి కరెంటు వైర్లు నేలకూలాయి. అలాగే కోమటి చేను, కొండాపూర్‌, రేవులగూడెం, ముత్యంపల్లి, కుర్రెగడ్‌లో ఇంటి పైకప్పు లేచి తడిసిన గోడలతో ఇళ్లు కూలాయి. ఇంట్లో వవ్చిన శబ్దానికి అప్రమత్తమైన కుటుంబసభ్యు లు బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

జిల్లాలో గాలివాన బీభత్సం
తాండూర్‌లో నేలకొరిగిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

- విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం

కాసిపేట, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మంగళవారం రాత్రి వీచిన గాలిభీభత్సవానికి చెట్లు విరిగిపోయి కరెంటు వైర్లు నేలకూలాయి. అలాగే కోమటి చేను, కొండాపూర్‌, రేవులగూడెం, ముత్యంపల్లి, కుర్రెగడ్‌లో ఇంటి పైకప్పు లేచి తడిసిన గోడలతో ఇళ్లు కూలాయి. ఇంట్లో వవ్చిన శబ్దానికి అప్రమత్తమైన కుటుంబసభ్యు లు బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. కోమటి చేనులో కూలిన కూలిన ఇంటిని తహసీ ల్దార్‌ బోజన్న బుధవారం పరిశీలించారు. విరిగి న చెట్లకొమ్మల వల్ల కరెంటు వైర్లు తెగిపోవ డం తో పదిగ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపో యింది. రాత్రంతా ప్రజలు అవస్థలు పడ్డారు.

నస్పూర్‌: నస్పూర్‌ పట్టణం సీసీసీ కార్నర్‌ సమీపంలో వేప చెట్టు మంగళవారం రాత్రి గాలివానకు కొమ్మలు విరిగి రోడ్డు మీద పడడం తో త్రుటిలో ప్రమాదం తప్పింది. వర్షంతో కూ డిన గాలి ఒక్కసారిగా రావడంతో వేపచెట్టు కొమ్మలు విరిగి జాతీయ రహదారిపై పడిపో యాయి, కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. పోలీసులు, స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు ధర్ని మధుకర్‌తో పాటు పలువురు చేరుకుని ఎక్స్‌కావేటర్‌ సహాయంతో చెట్టుకొమ్మ లను తొలగించారు. బుధవారం సాయంత్రం ఇదే చెట్టు మిగిలిన కొమ్మలు కూడా విరిగి పక్క నే ఉన్న విద్యుత్‌ స్తంభంపై పడడంతో స్తంభం విరిగిపోయింది. దీంతో పరిసర ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్టు కొమ్మ లు పడడంతో చెట్టు కింద ఉన్న దాదాపు 10 మోటర్‌ సైకిళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. చెట్టు కింద ఏవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

తాండూర్‌: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలుతో కూడిన వర్షంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలుల తీవ్రతకు తాండూర్‌ వెళ్లే దారిపై పెద్ద చెట్టు విరిగిపడడంతో రవాణాకు కొద్దిసేపు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాండూర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ పోలీసు సిబ్బంది స్థానికుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించారు. తాండూర్‌లో ఎనిమిది, అన్నారం , వేణునగర్‌లో ఒక్కో విద్యుత్‌ స్తంభం నేలకొర గడంతో పాటు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకొరిగింది. దాదాపు అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ శాఖ అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. సుమారు ఐదు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని విద్యుత్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Jun 11 , 2025 | 11:41 PM