సీపీఆర్పై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:20 PM
సీపీఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు. శనివారం వాంకిడి మండ లంలోని సామె గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదేశాల మేరకు వాంకి డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థులకు సీపీఆర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.

వాంకిడి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): సీపీఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు. శనివారం వాంకిడి మండ లంలోని సామె గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదేశాల మేరకు వాంకి డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థులకు సీపీఆర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వాంకిడి ఎస్సై ప్రశాంత్ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే ప్రథమ చికిత్స అందించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలి తే వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తే నిండు జీవితాన్ని కాపాడిన వారమవుతామన్నారు. సీపీఆర్ చేసే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం లో పోలీసు సిబ్బంది ఉన్నారు.
కెరమెరి (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారు మూల గ్రామమైన లక్మాపూర్లో కెరమెరి ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో సీపీఆర్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర వేళల్లో అనుస రించాల్సిన విధానాలపై గ్రామస్తులకు యువకులకు అవగాహ న కల్పించారు. సైబర్ క్రైంల పట్ల అప్రమత్తంగా ఉండాల న్నారు. అపరిచిత వ్యక్తులు బ్యాంకు వివరాలు అడిగితే తెలిపరాదన్నారు. అలాగే గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరించి నట్లయితే తమకు సమాచారం అందించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాల న్నారు. కార్యక్రమంలో పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి రహిత సమాజాన్ని నిర్మిదాం
లింగాపూర్ (ఆంద్రజ్యోతి): గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్ధామని జైనూర్ సర్కిల్ సీఐ రమేష్ అన్నారు. శుక్రవారం రాత్రి కొత్తపల్లిలో గ్రామ ప్రజలకు గంజాయి, గుడుంబా, నకలీ విత్తనాలతో జాగ్రత్తలు, సైబర్ క్రైం తదితర అంశాలపై ప్రజలను అవగాహన కార్యక్రమాన్ని పోలీసు కళా బృందంతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. గ్రామాల్లో రైతులందరు విత్తనాలు విత్తే సమ యమని, నకిలీ విత్తనాలతో జాగ్రత్తలు వహించాలని సూచిం చారు. లైసెన్స్లు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. గంజాయి రహిత సమాజం కోసం అందరూ చేయాలని అన్నారు. రైతులు దళారుల మాటలువిని చేన్లలో గంజాయి మెక్కలను పెట్టవద్దని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి భవిష్యతు కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో లింగాపూర్ ఎస్సై గంగన్న, ఆసిఫాబాద్ కళాబృందం సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.