Share News

గూడెం సత్యదేవుడి ఆలయంలో ఏరువాక పౌర్ణమి జాతర

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:42 PM

ఏరువాక పౌర్ణమిని పురష్కరించుకొని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో బుధవారం వైభవంగా జ్యేష్ట ఏరువాక పౌర్ణమి జాతర జరిగింది.

గూడెం సత్యదేవుడి ఆలయంలో ఏరువాక పౌర్ణమి జాతర
సామూహిక సత్యనారాయణస్వామి వత్రంలో పాల్గొన్న భక్తులు

- భక్తిశ్రద్ధలతో స్వామి వారికి పూజలు, సామూహిక వ్రతాలు

దండేపల్లి జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఏరువాక పౌర్ణమిని పురష్కరించుకొని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో బుధవారం వైభవంగా జ్యేష్ట ఏరువాక పౌర్ణమి జాతర జరిగింది. ఉదయం నుంచే పలు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు గూడెంనకు తరలివచ్చి సత్యదేవుడిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ సమీపంలో పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సత్యదేవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి వేదపండితులు ఆలయ ఆర్చకులు నిత్యపూజలు, ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వందలాది మందికి పైగా భక్తులు కుటుంబ సమేతం గా స్వామి వారి సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచ రించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించా మని ఆలయ నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్‌ వెల్లడించారు.

Updated Date - Jun 11 , 2025 | 11:42 PM