పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:31 PM
పర్యావరణం కాపాడాల్సిన బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మంచిర్యాల సీనియర్ సివిల్ జడ్జి డి రమమోహన్ రెడ్డి అన్నారు.

- మంచిర్యాల సీనియర్ సివిల్ జడ్జి రమమోహన్ రెడ్డి
- ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
లక్షెట్టిపేట, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణం కాపాడాల్సిన బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మంచిర్యాల సీనియర్ సివిల్ జడ్జి డి రమమోహన్ రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్తో కలిసి కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ పర్యావరణం పెంపొందించాలంటే విధిగా ప్రతీ ఒక్కరు మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని కూడా పూర్తిగా తగ్గించుకోవాలని సూచించారు. మొక్కలు, చెట్లు లేకపోవడంతోనే రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, అడవుల్లో చెట్లు లేక జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో లక్షెట్టిపేట అటవీక్షేత్ర అధికారి అత్తె సుభాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ఏజీపీ సత్యం, సీనియర్ న్యాయవాదులు అక్కల శ్రీధర్, కారుకూరి సురేందర్, రవీందర్రావు, నళినికాంత్, నేరెళ్ల పద్మ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
లక్షెట్టిపేట: లక్షెట్టిపేట ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా వంద రోజుల యాక్షన్ ప్లాన్లో బాగంగా మున్సిపాలిటీ ఆద్వర్యంలో పలు వార్డుల్లో సిబ్బంది మొక్కలను నాటారు. ప్రజలకు తడి పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ ప్రశాంత్, నరేష్ తో పాటు సిబ్బంది కట్ల రాకేష్, శంకరయ్య ఉన్నారు.
మంచిర్యాలకలెక్టరేట్: ప్రతీ పౌరుడు ప్రకృతిని, పర్యా వరణాన్ని పరిరక్షించేందుకు పాటుపడాలని వాల్టా అథారిటి సభ్యుడు గుండేటి యోగేశ్వర్ సూచించారు. గురువారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్మణికుమార్తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. పరిసరాల్లో పలు మొక్కలను నాటారు. జీవ జాతులకు హాని చేసే సింగిల్ యాజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని, ప్రకృతి పర్యావర ణాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంసీసీ అధ్యక్షుడు ప్రకాశ్రావు, డీజీఎం అనిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్: ప్రతీఒక్కరు విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు తెలిపారు. గురువారం ప్రపం చ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అ నంతరం మొక్కలు నాటారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుండాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కాంపెల్లి శంకర్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణలో ఉపాద్యాయులతో మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
మంచిర్యాలకలెక్టరేట్: మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. మంచి ర్యాలలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా ముం దుకు వెళ్లాలని సూచించారు. దుర్గం అశోక్ తదితరులు పాల్గొన్నారు.