Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:42 PM

బడి బయట పిల్లలు, బడి ఈడు పిల్లలు తప్పకుండా ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చేర్పించా లని గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి చిరంజీవి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి
ఇందానిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి చిరంజీవి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 9(ఆంఽధ్రజ్యోతి): బడి బయట పిల్లలు, బడి ఈడు పిల్లలు తప్పకుండా ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చేర్పించా లని గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి చిరంజీవి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌ బాలికల ఆశ్రమ పాఠశాలలో స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని పలు గ్రామాల్లో బడిబాట నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వేశ్వర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలోని ఇందాని, తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బడిమానేసిన పిల్లలను పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంఈవో శివచర ణ్‌ సూచనలు ఇచ్చారు. సీఆర్పీ సందీప్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

సిర్పూర్‌(యు): మండలంలోని మహగాం స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని తుమ్రిగూడ,మహగాం,కోడ్డిగూడ,లీగూడ,పాటేల్‌గూడ,పాములవాడ తదితర గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని మహగాం స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు ఆత్రం రమా పరిశీలించారు. కార్యక్రమంలో మహగాం ఎస్‌సీఆర్పీ మండాడి గాగ్రు, ఉపాధ్యాయులు కోట్నాక పాండురంగ్‌, కోవ నారాయణ్‌,మంజుల, అరివింద్‌, జయశ్రీ, రాజేశ్వర్‌, క్రిష్ణకుమార్‌ పాల్గొన్నారు.

దహెగాం: మండలంలోని దహెగాం, గొర్రెగుట్ట, ఇట్యాల, పెసరికుంట గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:43 PM