Share News

Vande Bharat Express: విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:53 AM

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ప్రయాణించే 16 బోగీల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అదనంగా నాలుగు బోగీలను జతచేసి శనివారం

Vande Bharat Express: విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ప్రయాణించే 16 బోగీల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అదనంగా నాలుగు బోగీలను జతచేసి శనివారం నుంచి 20 బోగీలతో నడపనున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం-సికింద్రాబాద్‌(20707-20708) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఇదివరకు 14 ఏసీ చైర్‌కార్‌, రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉండేవి. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లను యథాతథంగా ఉంచి ఏసీ చైర్‌కార్‌ కోచ్‌ల సంఖ్యను 18కి పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - Jul 05 , 2025 | 04:53 AM