Share News

Medigadda Barrage: బ్యారేజీల పరీక్షలకు రూ.11.40 కోట్లు

ABN , Publish Date - May 29 , 2025 | 03:46 AM

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం..

Medigadda Barrage: బ్యారేజీల పరీక్షలకు రూ.11.40 కోట్లు

  • ప్రభుత్వానికి తెలిపిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి) : జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పరీక్షలకు రూ.11.40 కోట్లు ఖర్చవుతాయని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పుణె) అంచనా వేసింది. ఇటీవలే ప్రభుత్వం ఈ 3 బ్యారేజీల్లో పరీక్షల బాధ్యతను సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు అప్పగించింది. దాంతో ఆ సంస్థ పరీక్షలకు అవసరమైన అంచనాలను రూపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఒక్కో బ్యారేజీకి రూ.3.80 కోట్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టింది.

Updated Date - May 30 , 2025 | 03:01 PM