Google Chrome Users: హై రిస్క్లో క్రోమ్ యూజర్లు.. ప్రభుత్వం హెచ్చరిక..
ABN , Publish Date - May 19 , 2025 | 09:09 PM
Google Chrome Users: గూగుల్ క్రోమ్ వాడే వారి కంప్యూటర్లను సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమస్యను హై రిస్క్ సమస్యగా ప్రకటించింది.

మొబైల్ ఫోన్ కావచ్చు.. డెస్క్ టాప్ కావచ్చు. ఇంటర్ నెట్ బ్రౌజ్ చేసే 65 శాతం మంది గూగుల్ క్రోమ్ను వాడుతున్నారు. అంటే ఈ సంఖ్య కొన్ని కోట్లల్లో ఉంటుంది. ఇండియాలో కూడా జనం పెద్ద ఎత్తున క్రోమ్ వాడుతున్నారు. క్రోమ్ బ్రౌజర్ వాడే వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అది కూడా డెస్క్ టాప్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడే వారికి హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. డెస్క్ టాప్లో గూగుల్ క్రోమ్ వాడే వారికి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT In) తెలిపింది.
గూగుల్ క్రోమ్ ఆర్బిటరీ కోడ్లో లోపం కారణంగా సులభంగా సైబర్ అటాక్కు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గూగుల్ క్రోమ్ వాడే వారి కంప్యూటర్లను సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సమస్యను హై రిస్క్ సమస్యగా ప్రకటించింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. గూగుల్ క్రోమ్ పాత వర్సెన్లలో ఈ సమస్య తలెత్తుతోందని తెలిపింది.
136.0.7103.113 లేదా అంతకంటే ఎక్కువ వర్సన్ గూగుల్ క్రోమ్ వాడే వారికి ఎలాంటి సమస్య లేదని పేర్కొంది. గూగుల్ సంస్థ 136.0.7103.113 లో ఈ సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. డెస్క్ టాప్లో క్రోమ్ వాడుతున్నవారు అప్డేట్ కోసం .. గూగుల్ క్రోమ్ ఒపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అక్కడ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎబౌట్ క్రోమ్లోకి వెళ్లి.. అక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తే చాలు.. క్రోమ్ అప్డేట్ అయిపోతుంది. మీరు సేఫ్ అవుతారు.
ఇవి కూడా చదవండి
YouTuber Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వ్లాగ్.. ఇది అస్సలు ఊహించలేదు..
Viral Video: ఫ్రెండ్ అని చూడకుండా ఎంత దారుణంగా ప్రవర్తించారు..