Share News

IPL 2025 Final: టాస్ గెలిచిన పంజాబ్.. మొదట బ్యాటింగ్ ఎవరంటే..

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:57 PM

క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. తొలి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రసవత్తర మ్యాచ్ కాసేపట్లో మొదలుకానుంది.

IPL 2025 Final: టాస్ గెలిచిన పంజాబ్.. మొదట బ్యాటింగ్ ఎవరంటే..
IPL 2025 Final

ఐపీఎల్ 2025 ఫైనల్ (IPL 2025 Final) మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు (జూన్ 3, 2025న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కాసేపట్లో మొదలుకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు ఆటకు దిగనుంది. అయితే ఈ రెండు జట్లూ కూడా ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోకపోవడం విశేషం. ఈ ఫైనల్ మ్యాచ్ వారి 18 ఏళ్ల టైటిల్ కలను సాకారం చేసే అవకాశం వచ్చింది. దీంతో టాస్ ఈ మ్యాచ్ ఫలితంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాస్ పాత్ర, అహ్మదాబాద్ పిచ్ లక్షణాలు, గత రికార్డుల గురించి విశ్లేషిద్దాం.


అహ్మదాబాద్ పిచ్ లక్షణాలు

నరేంద్ర మోదీ స్టేడియం ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్లు నమోదైన వేదికగా ప్రసిద్ధి గాంచింది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 8 మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు 200కు పైగా స్కోరు సాధించింది. 4 సార్లు 220ను కూడా దాటింది. ఈ పిచ్ ఎరుపు, నలుపు మట్టితో తయారైన మిశ్రమ ఉపరితలం కలిగి ఉంది. ఇది బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. సమాన బౌన్స్, వేగం ఉండటంతో బ్యాటర్లు స్ట్రోక్‌లు ఆడటానికి ఇష్టపడతారు. ఇక్కడ కొత్త బంతితో పేసర్లు కొంత మూవ్‌మెంట్‌ను, స్పిన్నర్లు దాదాపు 30% వికెట్లు తీసినప్పటికీ, ఫాస్ట్ బౌలర్లు 69% వికెట్లతో ఆధిపత్యం చెలాయించే ఛాన్సుంది. పెద్ద బౌండరీలు ఉన్న ఈ మైదానంలో బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.


టాస్ ప్రాముఖ్యత

ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన 8 మ్యాచ్‌లలో 6 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇది స్కోరు సెట్ చేసే జట్టుకు స్వల్ప ప్రయోజనాన్ని సూచిస్తుంది. అయితే, టాస్ గెలిచిన జట్టు 7 సార్లు ఛేజింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈ వేదికలో భారీ లక్ష్యాలను అంచనా వేయడం కష్టమని చెప్పుకోవచ్చు. ఈ గణాంకాలు టాస్ విషయంలో కీలకంగా ఉంటాయి. కానీ అది ఫలితాన్ని పూర్తిగా నిర్ణయించదు.


ఆర్సీబీ జట్టుకు నష్టమా..

పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడి, రెండింటిలోనూ విజయం సాధించింది. సీజన్ ఆరంభంలో 243/5 స్కోరు చేసి, క్వాలిఫయర్ 2లో 204 లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగా ఛేజ్ చేసింది. ఇది వారికి అహ్మదాబాద్ పరిస్థితులపై మంచి అవగాహన ఉందని చూపిస్తుంది. మరోవైపు, ఆర్సీబీ ఈ సీజన్‌లో ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, ఇది వారికి కొంత నష్టంగా పరిగణించవచ్చు.


ఇవీ చదవండి:

ఈ డాట్ ఉంటే అమెజాన్, లేదంటే ఫేక్..


జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 07:07 PM