Share News

Gautam Gambhir: పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదం.. గంభీర్ కోపానికి కారణం అదేనట..

ABN , Publish Date - Jul 29 , 2025 | 09:02 PM

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు.

Gautam Gambhir: పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదం.. గంభీర్ కోపానికి కారణం అదేనట..
Gautam Gambhir fight with Oval pitch curator

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), ఓవల్ పిచ్ క్యూరేటర్ (Oval pitch curator) లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 'నువ్వు ఇక్కడ కేవలం మైదాన సిబ్బందివి మాత్రమే. మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కావాలంటే మీ అధికారులకు ఫిర్యాదు చేసుకో' అంటూ గంభీర్ పిచ్ క్యూరేటర్‌ను హెచ్చరించాడు. ఆ సమయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కలుగచేసుకుని పిచ్ క్యూరేటర్‌ను కాస్త దూరంగా తీసుకెళ్లి సముదాయించాడు. అయినప్పటికీ గంభీర్, క్యూరేటర్ మధ్య వాగ్వాదం కొనసాగింది.


ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు. 'ఆటగాళ్లతో గంభీర్ ప్రాక్టీస్ చేయిస్తుండగా లీ ఫోర్టిస్ అక్కడకు వచ్చాడు. బ్యాటర్ మినహా మిగతా వారంతా వికెట్‌కు 2.5 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పాడు. రోప్ బయటకు వెళ్లండి అని గ్రౌండ్ సిబ్బంది వచ్చి ఆటగాళ్లను హెచ్చరించడం నేను ఇప్పటివరకు వినలేదు. అందుకే గంభీర్‌కు కోపం వచ్చింది. ఈ ఘటనపై టీమిండియా ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు' అని సితాన్షు వివరించాడు.


ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది (Ind vs Eng). దీంతో ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, గంభీర్ ప్రవర్తనపై ఓవల్ మైదానం సిబ్బంది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ డ్రా అవుతుంది.


ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 29 , 2025 | 09:26 PM