Aiden Markram: మార్క్రమ్ సూపర్ సెంచరీ.. విరాట్ కోహ్లీ పాత ట్వీట్ వైరల్..
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:25 PM
దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు.

దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC final) ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది (SA vs Aus). ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐదెన్ మార్క్రమ్ (Aiden Markram) 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన మార్క్రమ్, రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఆసీస్ క్వాలిటీ పేస్ ఎటాక్ను ఎదుర్కొని అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో మార్క్రమ్ మీద మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఏడేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ మళ్లీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2018లో కేప్టౌన్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో మార్క్రమ్ 84 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్పై సోషల్ మీడియా ద్వారా కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 'ఐదెన్ మార్క్రమ్ ఇన్నింగ్స్ చాలా సంతోషం కలిగించింది' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. అప్పటి ట్వీట్ ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా మార్క్రమ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్గా నిలిచాడు. అలాగే స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సెంచరీ చేసిన మూడో బ్యాటర్గా నిలిచాడు.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి