Sai Rajesh: బాబిల్ ఖాన్ గొడవ.. మండిపడ్డ సాయి రాజేష్
ABN , Publish Date - May 06 , 2025 | 10:06 AM
Sai Rajesh: బాబిల్ ఖాన్ గొడవపై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. బాబిల్ ఖాన్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమంతా వెధవలమా అంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు.

దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ బాలీవుడ్పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటీ,నటులు అనన్య పాండే, అర్జున్ కపూర్, షనాయా కపూర్, సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్లపై కామెంట్లు చేశారు. వెక్కి వెక్కి ఏడుస్తూ వారిపై కామెంట్లు చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే బాలిల్ ఆ పోస్టును డిలీట్ చేశారు. ఆ తర్వాత బాబిల్ చేసిన కామెంట్లపై అతడి టీం ఓ నోట్ విడుదల చేసింది. బాబిల్ కామెంట్లు చేసిన వారికి క్షమాపణలు ప్రకటించింది. అయితే, బాబిల్ వీడియో పెట్టడం.. డిలీట్ చేయటం.. అతడి టీం బాబిల్ తరపున సదరు సెలెబ్రిటీలకు క్షమాపణలు చెప్పటంపై దర్శకుడు సాయి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ బాబిల్ ఖాన్ టీంకు. మేము నిశబ్ధంగా పక్కకు వెళ్లిపోతామని అనుకుంటున్నారా. ఇదేం పద్దతి. బాబిల్ పేర్లు చెప్పిన వాళ్లే మర్యాదకు అర్హులా. ఇప్పటి వరకు అతడికి అండగా నిల్చిన వాళ్లం వెధవలమా.. బాబిల్ వాళ్ల మీద అరిచినందుకు .. మీరు వాళ్లను విలువైన వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోవటం లేదు. పరిస్థితులను హ్యాండిల్ చేసిన విధానాన్ని చూస్తుంటే మాకు కూడా క్షమాపణ చెప్పాలి. గంట క్రితం వరకు నేను బాబిల్కు మద్దతుగా ఉన్నాను. కానీ, మీరు మమ్మల్ని ఖాతరు చేయటం లేదు. ఈ సింథపీ ఆటలు మా దగ్గర పని చేయవు. మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే’ అని అన్నారు.
బాబిల్ ఖాన్ పోస్టుకు సాయి రాజేష్ కామెంట్ కూడా పెట్టారు. ‘ నువ్వు నిజంగా నా గుండెను ముక్కలు చేశావు. నీ కోసం నా సర్వం దారపోశాను. నీ క్యారెక్టర్కు న్యాయం చేయడానికి శారీరకంగా చాలా కష్టపడ్డాను. రెండేళ్లు అన్నిటిని వదులుకున్నాను. నీ కోసం 500 రోజులు అన్నటిని త్యాగం చేశాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాయి రాజేష్ కామెంట్లపై బాబిల్ ఖాన్ స్పందించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ‘ నేను మానసికంగా ఎంత కృంగిపోతున్నానో చెప్పలేను.
నా క్యారెక్టర్తో మీరు సంతృప్తి చెందాలని నా ప్రాణం పెట్టాను. చెత్తలో బతికాను. పర్లేదు. ఇకపై నా పని మాట్లాడుతుంది. మీకు నా నవ్వు కావాలి.. అందుకే ఏడుపు ఆపుకుంటున్నాను. నీ కోసం నా చెయ్యి కోసుకుంటా’ అని అన్నారు. కాగా, తెలుగులో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. దానికి సాయి రాజేషే దర్శకత్వం వహిస్తున్నారు. అందులో బాబిల్ ఖాన్ ఓ పాత్ర చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు