Share News

Chandrababu Naidu: టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:57 PM

Chandrababu Naidu: ఇతర పార్టీల వారిని పార్టీలోకి తీసుకునే ముందు పార్టీ కేంద్ర కార్యాలయం అనుమతి తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర కార్యాలయం అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు.

Chandrababu Naidu: టీడీపీ నేతలకు అధినేత  చంద్రబాబు కీలక ఆదేశాలు
Chandrababu Naidu

అమరావతి: తెలుగు దేశం పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరిట ఓ పత్రికా ప్రకటన విడుదల అయింది. ఇతర పార్టీల వారిని పార్టీలోకి తీసుకునే ముందు పార్టీ కేంద్ర కార్యాలయం అనుమతి తీసుకోవాలని పల్లా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో చేరే వారి గురించి పూర్తిగా విచారించి.. కేంద్ర కార్యాలయం అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. టీడీపీలో అన్ని హోదాల్లో ఉన్న నేతలు ఈ ఆదేశాలను పాటించాలని పల్లా శ్రీనివాస రావు కోరారు.


టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్

టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని.. ఎమ్మెల్యేలు అందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలతో అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్నిపెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని కోరారు.


ఇవి కూడా చదవండి

11 ఏళ్లలో ఎంత మార్పు.. దేశంలో భారీగా తగ్గిన పేదరికం

తారాస్థాయికి గొడవలు.. మస్క్‌ను పుల్లలా తీసిపడేసిన ట్రంప్

Updated Date - Jun 07 , 2025 | 01:59 PM