భారత్లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:51 PM
ఎమ్జీ కంపెనీ ఎట్టకేలకు భారత్లో తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్స్టర్ను విడుదల చేసింది. రూ.74.99 ఎక్స్ షోరూం ధరతో రిలీజ్ చేసిన ఈ కారును ఇప్పటికే అనేక మంది ప్రీబుక్ చేసుకున్నారు. దేశంలో అత్యంత చవకైన 2 డోర్ కన్వర్టిబుల్ కారుగా పేరు పడ్డ ఈ వాహనం ఫీచర్స్ ఏంటో చూద్దం.

ఎమ్జీ సైబర్స్టర్ కారులో 77కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి బ్యాటరీని చార్జ్ చేస్తే 580 కిలోమీటర్లు నిరాఘాటంగా ప్రయాణించొచ్చు.

ఇందులోని డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్తో 725 ఎన్ఎమ్ టార్క్, 510 బీహెచ్పీ శక్తి ఉత్పత్తి అవుతుంది.

సైబర్స్టర్ కేవలం 3.2 సెకెన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.

సూపర్ ఫాస్ట్ చార్జర్తో కేవలం 40 నిమిషాల్లో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చు.

ఈ కన్వర్టబుల్ కారులో 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 7 అంగుళాల డిస్ప్లే, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, 8 స్పీకర్ బేస్ ఆడియో సిస్టమ్ తదితర ఫీచర్స్ ఉన్నాయి

వెహికిల్ టు లోడ్, గాల్లోని సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేసే పీ.ఎమ్ 2.5 ఫిల్టర్, మల్టిపుల్ ఎయిర్బ్యాగ్స్, టీపీఎమ్ఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

మొత్తం నాలుగు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఆండస్ గ్రే, రెడ్ రూఫ్, ఫ్లే్ర్ రెడ్, బ్లాక్ రూఫ్ల్లో నచ్చిన దాని వినియోగదారులు ఎంచుకోవచ్చు.
Updated at - Jul 28 , 2025 | 02:00 PM